-గత ప్రభుత్వం వైఫల్యాల కారణంగానే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి
-ఏపీ ప్రభుత్వం గంజాయి పై ఉక్కు పాదం మోపుతోంది మంత్రి సవితమ్మ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పార్టీ , తన రాజకీయ ఉనికి కోసం ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్న వైసీపీ వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం మాకులేదని కౌంటర్ ఇచ్చిన మంత్రి సవితమ్మ శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం నల్ల బొమ్మిని పల్లి గ్రామ సమీపంలోఉపాది కోసం వలస వచ్చిన కుటుంబంపై దుండగుల చేతిలో అత్యాచారానికి పాల్పడ్డ అత్త మరియు కోడలు హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించిన మంత్రి సవితమ్మ అధైర్య పడకండి మీకు ప్రభుత్వం అండగా ఉంటుందని పరార్శించారు.
అనంతరం మీడియా తో మంత్రి సవితమ్మ మాట్లాడుతూ ఈ ఘటన పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర హోంమంత్రి వగలపూడి అనిత స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అంతా సీరియస్ గా తీసుకున్నామని . అమాయక మహిళలపై అతి దారుణమైన చర్య జరిగింది, గత ప్రభుత్వం వైఫల్యాల కారణంగానే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.గత ఐదేళ్లలో గంజాయిని ప్రోత్సహించింది ఎవరో అందరికీ తెలుసునని గంజాయి వల్ల యువత పెడదారి పడుతోంది.ఏపీ ప్రభుత్వం గంజాయి పై ఉక్కు పాదం మోపుతోందని మంత్రి సవితమ్మ తెలియచేసారు. అదేవిధంగా ఘటన జరిగి 24 గంటలు గడవకనే పోలీస్ లు నిందితులను పట్టుకున్నారని మొత్తం 6 గురు నిందితులు ఘటనలో ఉన్నారని వారంతా గంజాయికి అలవాటు పడినవారని అనేక కేసుల్లో నిందితులుగా ఉండి, జైళ్లకు కూడా వెళ్ళొచ్చారని పోలీసుల విచారణలో తెలుస్తున్నాయని మంత్రి సవితమ్మ తెలియచేసారు. ఘటనలో పాల్పడిన నిందితులు ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పార్టీ ,తన రాజకీయ ఉనికి కోసం ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్న వైసీపీ వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం మాకులేదని కౌంటర్ ఇచ్చిన మంత్రి సవితమ్మ. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కొల్లకుంట ఆంజినప్ప, రాష్ట్ర కార్యదర్శి రామాంజినమ్మ ,హిందూపురం పట్టణ అధ్యక్షులు డి ఈ రమేష్ స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News