అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఫ్రాన్స్,ఇటలీ పర్యటన పూర్తి చేసుకుని విజయవాడ కు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి బిజెపి రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. కుటుంబ సమేతంగా విదేశాలకు వెళ్లినప్పటికీ ఒక స్టడీ టూర్ లాగ పర్యటన కొనసాగింది.పురందేశ్వరి గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి నేరుగా బిజెపి రాష్ట్ర కార్యాలయం చేరుకుని అందుబాటులో ఉన్న బిజెపి నేతలు తో సంస్థాగత విషయాలు పై సమీక్ష నిర్వహించారు.
ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ ఈశ్వర రావు, మాజీ మంత్రి శనక్కాయల అరుణ, బిజెపి రాష్ట్ర మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురు పాటి కుమార స్వామి, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీ రాం తదితరులు పురంధేశ్వరి ని కలిసి అభినందించారు
Prajavartha Online Telugu News