తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను ఇనుమడింపజేసేలా కృషి చేస్తానని టీటీడీ బోర్డు సభ్యులు నన్నూరి నర్సిరెడ్డి తెలియజేశారు. బోర్డు సభ్యులుగా అవకాశం కల్పించినందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ధన్యవాదాలు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి ప్రత్యేక ధన్యవాదాలు. పార్టీలో నన్ను అన్ని విధాలా ప్రోత్సహించి టీటీడీ బోర్డు సభ్యునిగా నియమించినందుకు తెలుగుదేశం పార్టీకి జీవితాంతం రుణపడి ఉంటాను. భక్తులకు మెరుగైన సేవలు అందించేలా బోర్డు సభ్యునిగా నా శాయశక్తులా కృషి చేస్తాను. నాకు సహకరించిన పార్టీ నాయకులకు, శ్రేణులకు, కార్యకర్తలకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. తిరుమలలో సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పిస్తాం. హిందూ సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తాం. శ్రీవారి ఆశీస్సులతో టీటీడీకి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు.
Tags tirupathi
Check Also
నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …
Prajavartha Online Telugu News