అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కింబర్లీ-క్లార్క్ ఇండియా సంస్థ చిన్నారుల కోసం 3.89 లక్షల డైపర్లను విరాళంగా ఇచ్చింది. నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని రూ.34.95 లక్షల విలువైన 3.89 లక్షల డైపర్లను పేదవర్గాల పిల్లలకు ఇచ్చేందుకు విరాళంగా అందించింది. సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి కింబర్లీ- క్లార్క్ మేనేజింగ్ డైరక్టర్ రాహుల్ ఆస్థాన, సంస్థ ప్రతినిధి ప్రీతి బినోయ్ డైపర్ల కోసం చెక్కును అందించారు. కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News