విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆలయ కార్యనిర్వాహనాధికారి కె ఎస్ రామరావు మహామండపం 4వ అంతస్తు లోని కార్యనిర్వాహనాధికారి వారి కార్యాలయం నందు అన్ని విభాగముల అధికారులతో ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించి, పలు అంశాలపై సమీక్షించారు. ఇందులో భాగముగా సంబంధిత విభాగపు అంశముల నిర్వహణ మరియు మెరుగుపరచుట, బడ్జెట్ అంశములుపై సమీక్ష, గత సమావేశములలో నిర్వహించిన అంశములపై సమీక్ష, పార్కింగ్ మెరుగు పరచుట, ప్రసాదములు, కౌంటర్ల నిర్వహణ మెరుగుపరచుట, డిజిటలైజేషన్, శానిటేషన్ అభివృద్ధి, సాంస్కృతిక కార్యక్రమములు నిర్వహణ మెరుగుపరచుట, తదితర అంశములపై …
Read More »All News
పింఛన్ దారులకు చంద్రబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలి
-బీజేపీలో ఉన్నవారంతా టీడీపీ ముసుగువేసుకున్నవారే -రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ద్వేషంతో 66 లక్షల మందికి పింఛన్ అందకుండా చంద్రబాబు చేస్తున్నారని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో ఆదివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. వాలంటీర్ల వ్యవస్థ అంటేనే చంద్రబాబు అండ్ కో భయపడిపోతున్నారని మల్లాది విష్ణు అన్నారు. ఓవైపు వాలంటీర్ల ఆదాయం పెంచుతామంటూ …
Read More »స్వచ్ఛంద రక్తదాతలే మా లక్ష్యం
– మానవత రక్తదాతల సంస్థ. గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛంద రక్తదాతలే మా లక్ష్యమని మానవతా రక్తదాతల సంస్థ కో-కన్వీనర్ సలీంమాలిక్ ఈనెల 31వ తేదీన ఈస్టర్ పండుగ సందర్భంగా గుంటూరు నగరంలోని ఏసీ కళాశాలలో నిర్వహించిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపులో పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా జి జి హెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వై.కిరణ్ కుమార్,బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సురేష్, రేడియాలజీ డాక్టర్ జానీ లతో పాటు వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల …
Read More »ఆస్తి పన్ను వసూళ్లలో రాష్ట్రంలో తృతీయ స్థానంలో జిఎంసి
-సకాలంలో పన్ను చెల్లించి నగరాభివృద్ధికి సహకరించిన నగర ప్రజలకు ధన్యవాదాలు -కమిషనర్ కీర్తి చేకూరి గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని 1,95,906 అసెస్మెంట్లకు గాను మార్చి 31 నాటికి రూ.95 కోట్ల వసూళ్ళతో రాష్ట్రంలో 3 వ స్థానంలో నిలిచిందని, పన్ను చెల్లించి నగరాభివృద్ధికి సహకరించిన నగర ప్రజలకు, నగరపాలక సంస్థ అధికారులు, సచివాలయ కార్యదర్శులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు నగర కమిషనర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, …
Read More »అందరు ఓటువేస్తేనే ప్రజాస్వామ్యం
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలో ఓటు హక్కున్న వారందరూ ఓటు వేస్తేనే ప్రజాస్వామ్యాన్ని ని కాపాడిన వారమౌతామని తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖార్ జైన్(IAS) అన్నారు. ఆదివారం సాయంత్రం తెనాలిలోని కవి రాజా పార్క్లోని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో SVEEP కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మరియు రిటర్నింగ్ ఆఫీసర్ తెనాలి పాల్గొని సీనియర్ ఓటర్లతో సంభాషించి మీరు ఓటు వేసి అందరితో ఓటు వేయించాలని కోరారు, ఈ కార్యక్రమంలో తెనాలి తహసిల్దారు శ్రీనివాసరెడ్డి కమిషనరు బండి శేషన్న సీనియర్ సిటిజన్ …
Read More »సచివాలయం వద్ద ఏప్రియల్ 3 నుంచి సామజిక భద్రత పెన్షన్ల పంపిణీ
-కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు, ఆర్ధిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఏప్రిల్ నెలలో సామాజిక భద్రత పెన్షన్ 3 వ తేదీ నుంచి 8 వ తేదీ వరకు సచివాలయాలు వద్ద అందచేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత తెలియ చేశారు. ఆదివారం సేర్పు సి ఈ వో మురళీధర్ రెడ్డి నేతృత్వంలో విజయవాడ నుంచి న్ని జిల్లాల జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారులు, ఇతర అనుబంధ శాఖల పరిపాలన యంత్రాంగం తో వీడియో …
Read More »సుజనా చౌదరి గెలుపునకు తమవంతు సహకారం అందిస్తాం…. : డాక్టర్ తరుణ్ కాకాని
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల బీజేపీ పార్టీలో చేరిన కాకాని ఆశయ సాధన సమితి చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ యువనేత డాక్టర్ తరుణ్ కాకాని ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం NDA ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ సుజనా చౌదరితో సమావేశమయ్యారు. విజయవాడ పశ్చిమ భాజపా అభ్యర్థి (టీడీపీ, జనసేన పార్టీ మద్దతు) కార్యాలయాన్ని ఈరోజు భవానీపురంలో పలువురు బీజేపీ, టీడీపీ, జనసేన నేతల సమక్షంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ తరుణ్ కాకాని మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి …
Read More »యువ కెరటం డాక్టర్ గడ్డం ప్రియాంక
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కళలకు కానాచి అయిన విజయవాడలో మరో యువ కెరటం డాక్టర్ గడ్డం ప్రియాంక ఎగసిపడిరది. ఆయుర్వేద డాక్టర్ గడ్డం ప్రియాంక, పంచకర్మ స్పెషలిస్ట్, ఎమ్మెస్సీ సైకాలజిస్ట్ అయిన విజయవాడ నగరవాసి స్కూల్లో చదివే నాటి నుంచి భరత నాట్యంమీద మక్కువతో కాలేజీచదివే నాటి వరకు గురువుల సమక్షంలో అరంగేట్రం చేసి అనేక కార్యక్రమాలు చేశారు. తరువాత డాక్టర్ వృత్తిలో వుంటూ లలిత కళలు, పెయింటింగ్స్, కర్ణాటక సంగీతం ఆకర్షితురాలై ఖాళీ సమయంలో చేతివృత్తులు సాంప్రదాయ కళలు అయిన …
Read More »ప్రసార మాధ్యమాల్లో ప్రకటనలకు ఎం.సి.ఎం.సి అనుమతి తప్పని సరి: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా. జి.లక్ష్మీ శ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సాధారణ ఎన్నికలు -2024 సందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించి ప్రసార మాధ్యమాల్లో ప్రసారమయ్యే రాజకీయ ప్రచార ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.జి. లక్ష్మీ శ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరించి జిల్లా కలెక్టర్ వారి అధ్యక్షతన జిల్లా స్థాయి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రచార ప్రకటనలకు ముందస్తు …
Read More »జగన్ చేసింది గోరంత…చెప్పుకునేది కొండంత..85 శాతం హామీలు అమలు చేయలేదు.: టిడిపి ఎంపి అభ్యుర్ధి కేశినేని శివనాథ్ (చిన్ని)
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి రాజధానిగా వుండాలన్నా, యువతకి ఉద్యోగ అవకాశాలు లభించాలన్న టిడిపి, జనసేన, బిజెపి కూటమి అధికారంలోకి రావాలి..చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని బిజెపి, జనసేన బలపరిచిన విజయవాడ పార్లమెంట్ టిడిపి ఎంపి అభ్యర్థి కేశినేని శివనాథ్(చిన్ని) అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 32వ డివిజన్ లోటన్ ల్యాండ్ మార్క్ సెక్టార్ -1 వన్ లో శివనాథ్, సెంట్రల్ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్ధి బొండా ఉమామహేశ్వరరావు కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ మ్యానిఫెస్టో …
Read More »
Prajavartha Online Telugu News