పోలవరం, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతంలో జులై 19 (సోమవారం) రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులతో ముందస్తు ఏర్పాట్లను సమీక్షించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. శనివారం ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి హెలిప్యాడ్, పోలవరం ప్రాజెక్ట్ వ్యూ పాయింట్, పోలవరం సైట్ లలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, ఇరిగేషన్, ఇతర సమన్వయ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి …
Read More »Andhra Pradesh
పెదలంక డ్రైన్లో డ్రెడ్జింగ్ పనులను ఫ్రారంభించిన శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు
కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త : డ్రైన్లను సక్రమంగా సాగేవిధంగా చూడగలిగితే వర్షాలు,వరదల సమయంలో ముంపు నివారణ సాధ్యమౌతుందని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. శనివారం కలిదిండి మండలం కోరుకొల్లు లోని పెదలంక డ్రైన్ లో గుఱ్ఱపుడెక్క,కిక్కిస,తూడు తొలగింపు పనులకు ఆయన చేతులమీదుగా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెదలంక డ్రైన్ డ్రెడ్జింగ్ పనులు మంజూరై కొనసాగుతున్నాయని, అయితే డ్రైన్ ఎగువ భాగంలో నీటి ప్రవాహం కిక్కస, గుఱ్ఱపుడెక్క,తూడు మూలంగా సక్రమంగా సాగక రైతుల పొలాలు ముంపు నకు గురియవుతున్న విషయం …
Read More »రైతుల సమస్యలను పరిష్కరించేందుకే రైతు చైతన్య యాత్రలు..
-శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త : రైతుల సమస్యల్ని గుర్తించి ప్రభుత్వానికి నివేదించి పరిష్కరించి తద్వారా రైతుల్ని బలోపేతం చేయడమే రైతు భరోసా చైతన్య యాత్రల ముఖ్యోద్దేశమని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. రైతు భరోసా చైతన్య యాత్రల్లో భాగంగా శనివారం కలిదిండి మండలం పడమటి పాలెం లో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల పట్ల గత ప్రభుత్వాల మాదిరి కాకుండా ఒక స్పష్టమైన వైఖరితో ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి …
Read More »పేదలకు ఇచ్చే ఇళ్ళని పూర్తిగా ప్రభుత్వ ఖర్చులతోనే నిర్మించాలి…
-తక్షణమే పునాదులవరకు లబ్దిదారులనే నిర్మించుకోవాలని భయప్రాంతులకు గురి చెయ్యడం సరికాదు… -టీడీపీ హయాంలో నిర్మించిన TIDCO ఇళ్లను లబ్ధిదారులకు తక్షణమే అందించాలి... విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇళ్ళు లేని నిరుపేదలందరికీ పక్కా ఇళ్ళు ఇవ్వాలని, ఇచ్చిన సెంటు స్థలంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమే పూర్తి ఖర్చులతో ఇళ్లను నిర్మించాలని, చంద్రబాబు నాయుడు హయాంలో కట్టిన tidco ఇళ్లను లబ్ది దారులకు తక్షణమే అందించాలని డిమాండ్ చేస్తూ శనివారం గాంధీ నగర్ అలంకార్ సెంటర్ లోని ధర్నా చౌక్ నందు ధర్నా …
Read More »19 జులై నుండి అన్రిజర్వ్డ్ రైళ్ల సర్వీసులను పునరుద్ధరించనున్న దక్షిణ మధ్య రైల్వే…
-ఈ రైళ్లు ఎక్స్ప్రెస్ రైళ్లతో సమానంగా నడుస్తాయి -ప్రయాణికులకు ఉపయోగపడనున్న రైళ్ల వేగవంతం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్`19 మహమ్మారితో ఎదురైన ఇబ్బందులతో దశలవారిగా రైళ్ల సర్వీసులను ప్రారంభిస్తున దక్షిణ మధ్య రైల్వే ముఖ్యంగా స్థానిక ప్రయాణికులకు ప్రయోజనం కలిగేలా జోన్ పరిధిలో అన్రిజర్వ్డ్ రైళ్ల సర్వీసులను పునరుద్ధరించనుంది. ప్రధానంగా ఈ రైళ్లు ఎక్స్ప్రెస్ రైళ్లతో సమానంగా నడుపబడుతాయి. అనగా ఇవి అన్రిజర్వ్డ్ ఎక్స్ప్రెస్ రైళ్లగా నిర్వహించబడుతాయి. దీంతో ప్రయాణ సమయం తగ్గి ప్రయాణికులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దక్షిణ మధ్య …
Read More »డివిజన్ అభివృద్ధి మా బాధ్యత : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని ప్రతి డివిజిన్లో అంతర్గత రోడ్లు, మంచినీటి సౌకర్యం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేసే బాధ్యత వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వనిది అని,అందుకు తగ్గ కార్యాచరణ రూపొందించి నిధులు మంజూరు చెపిస్తున్నాం అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శనివారం 3 వ డివిజన్ గంగిరెద్దుల దిబ్బ,వైస్సార్ కాలనీ నందు స్థానిక కార్పొరేటర్ బిమిశెట్టి ప్రవల్లిక, నాయకులతో కలిసి పర్యటించిన అవినాష్ ఇంటి ఇంటికి …
Read More »తొలి కౌన్సిల్ సమావేశంలోనే బట్టబయలైన తెలుగుదేశం సభ్యుల అవినీతి భాగోతం…
-గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం నాయకుల అవినీతి భాగోతం తొలి కౌన్సిల్ సమావేశంలోనే బహిర్గతమైందని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా 57వ డివిజన్ న్యూ ఆర్.ఆర్.పేటలో ఆయన విస్తృతంగా పర్యటించారు. స్థానిక కార్పొరేటర్ ఇసరపు దేవి రాజారమేష్ తో కలిసి సుందరమ్మ దిబ్బ, సుబ్బరాజు నగర్, అరుణోదయ నగర్ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. …
Read More »వినియోగదారుల హక్కులపై రోటరీ మిడ్టౌన్ అవగాహన…
-వర్చువల్గా పాల్గొన్న ప్రతినిధులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా భారతదేశంలో అతిపెద్ద క్లబ్లలో ఒకటైన రోటరీ మిడ్టౌన్ విజయవాడ , ఆసరా అడ్వకేట్ అసోసియేషన్ సంయుక్తంగా సామాజిక బాధ్యతగా వినియోగదారుల హక్కులపై కల్పిస్తూ శనివారం నిర్వహించిన జూమ్ యాప్ సమావేశం నిర్వహించారు. వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించడం ద్వారా ప్రజలను సాధికారపరిచే కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు. రోటరీ మిడ్టౌన్ విజయవాడ వివిధ సామాజిక సేవల కార్యకలాపాలకు ప్రసిద్ది చెందింది, రోటరీ విజయవాడ అధ్యక్షులు పార్థసారధి, ఉపాధ్యక్షులు గుడపాటి …
Read More »కామినేని అడ్వాన్స్డ్ గ్యాస్ట్రో కేర్ నందు అందుబాటులో అధునాతన వైద్య సేవలు…
-పలు క్లిష్టమైన కేసుల్లో విజయవంతంగా చికిత్సలు -అత్యాధునిక పరిజ్ఞానం, అనుభవజ్ఞులైన వైద్య నిపుణులతో మెరుగైన ఫలితాలు -మీడియా సమావేశంలో కామినేని సీవోవో డాక్టర్ నవీన్ కుమార్ వెనిగళ్ల విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని కామినేని హాస్పిటల్స్ గ్యాస్ట్రో విభాగంలో అధునాతన సేవలు అందుబాటులో ఉన్నాయి. అనుభవజ్ఞులైన నిపుణుల ఆధ్వర్యంలో స్కానింగ్ తదితర వ్యాధి నిర్ధారణ పరీక్షలు, మందులతో చికిత్స, శస్త్రచికిత్స, ఎండోస్కోపీ తదితర సేవలను అందిస్తున్నారు. కామినేని గ్యాస్ట్రో విభాగంలో ఇటీవల కొన్ని క్రిటికల్ కేసుల్లో విజయవంతంగా చికిత్సనందించి, పేషేంట్ల ప్రాణాలను …
Read More »అన్లైన్ క్లాసులను తనిఖీ చేసిన అదనపు కమిషనర్ డాక్టర్ జె.అరుణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని పటమటలంక వల్లూరి సరోజని మున్సిపాల్ కార్పొరేషన్ హై స్కూల్ లో నిర్వహిస్తున్న ఆన్ లైన్ క్లాసులను శనివారం నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ (జనరల్) డాక్టర్ జె.అరుణ, ఆకస్మిక తనిఖీ చేశారు. స్కూల్ లోని సిబ్బందితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకుని, అన్లైన్ లో ఉన్న పిల్లలతో మాట్లాడుతూ వీడియో & వాయిస్ క్లారిటిగా వస్తున్నది లేనిది స్వయంగా పరిశీలించారు. టీచర్స్ చెప్పిన సబ్జెక్టులు అర్థమవుతున్నది లేనిది అడిగి తెలుసుకొన్నారు. …
Read More »
Prajavartha Online Telugu News