Breaking News

Daily Archives: September 27, 2024

APGENCO మరియు NHPC ల సంయుక్త భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్‌ను పునరుత్పాదక శక్తి రంగంలో అగ్రస్తానంలో నిలపడానికి ఒప్పందం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : APGENCO (Andhra Pradesh Power Generation Corporation Limited) మరియు NHPC (National Hydro Electric) ల సంయుక్త బాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్‌ను పునరుత్పాదక శక్తి రంగంలో అగ్ర స్థానంలో నిలిపేందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమానికి ఎనర్జీ మినిస్టర్ గొట్టిపాటి రవి కుమార్, ఎనర్జీ సెక్రటరీ కె. విజయానంద్, APGENCO మేనేజింగ్ డైరెక్టర్ కె.వి.ఎన్ చక్రధర్ బాబు, మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ఒప్పందం ద్వారా APGENCO …

Read More »

మానవత్వం చాటుకున్న మంత్రి పార్థసారథి

-తాను ప్రజల సేవకుడిని అనడమే కాదు..చేతల్లో చూపిన మంత్రి -రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు వెంటనే వైద్య సేవలందేలాచేసిన మంత్రి నూజివీడు/ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : చాట్రాయి మండలంలో పర్యటన నిమిత్తం శుక్రవారం నూజివీడు లో మంత్రి కార్యాలయంనకు వస్తున్న రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నూజివీడు మండలం తుక్కులూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం చూసి వెంటనే స్పందించారు. తాను స్వయంగా తన వాహనం దిగి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మెర్సీపూడి కి చెందిన …

Read More »

జిల్లాలో ఎక్కడ కూడా నీటి సమస్య రాకూడదు

-అన్ని శాఖల సహకారంతో ధర్మవరం నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడం జరుగుతుంది -కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే వివిధ సంక్షేమ పథకాలను అర్హులైన వారికి అందజేయవలసిన బాధ్యత అధికారులపై ఉన్నది -రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ధర్మవరం, నేటి పత్రిక ప్రజావార్త : అన్ని శాఖల సహకారంతో ధర్మవరం నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి నా వంతు కృషి చేస్తానని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం ధర్మవరం క్యాంప్ కార్యాలయంలోని …

Read More »

తిరుమల శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ టీటీడీ నిబంధనలను పాటించాలని కోరుతున్నా…

-భక్తుల మనోభావాలు, ఆచారాలకు భిన్నంగా ఏ ఒక్కరూ వ్యవహరించొద్దని విజ్ఞప్తి చేస్తున్నా : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్వీట్ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయం కోట్ల మంది హిందువుల అతిపెద్ద పుణ్యక్షేత్రం. ఈ దివ్యక్షేత్రం మన రాష్ట్రంలో ఉండడం మన అందరి అదృష్టం. ఏడుకొండలవాడి పవిత్రతను కాపాడేందుకు, భక్తుల మనోభావాలను పరిరక్షించేందుకు మా ప్రభుత్వం ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. తిరుమల దర్శనానికి వెళ్లే ప్రతి భక్తుడు అత్యంత నియమనిష్ఠలతో, శ్రద్ధాసక్తులతో స్వామివారిని కొలుస్తారు. …

Read More »

“వర్నెన్స్ నౌ 9th పి ఎస్ యు ఐటీ అవార్డ్స్” రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన మంత్రి మండి పల్లి రాంప్రసాద్ రెడ్డి

-రానున్న రోజులలో ప్రజలను మరింత మెరుగైన సేవలు అందిస్తామని మంత్రి వెల్లడి విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2024 సంవత్సరమునకు గాను “గవర్నెన్స్ నౌ 9th పి ఎస్ యు ఐటీ అవార్డ్స్” కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎంపిక కావడం పట్ల రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సంతోషం వ్యక్తం చేసారు. “యాప్” ద్వారా నగదు రహిత లావాదేవీలు, కాగిత రహిత టికెట్ల జారీ సౌలభ్యాన్ని ప్రవేశ పెట్టడం, ఇన్ బస్సు …

Read More »

ఏపీ అభివృద్ధికి బిజెపి కట్టుబడి ఉంది… : దగ్గుబాటి పురంధేశ్వరి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాల్లో ఆర్థికంగా బలోపేతం చేయడానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. భవానిపురం లోని ఎస్ కన్వెన్షన్ సెంటర్ లో శుక్రవారం బిజెపి సభ్యత్వాల నమోదు కార్యక్రమం నేపథ్యంలో బిజెపి నాయకులు, శ్రేణులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పురందేశ్వరి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 18 కోట్ల సభ్యత్వాలను నమోదు చేసి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బిజెపి ఆవిర్భవించిందన్నారు. …

Read More »

కార్యకర్త కుటుంబానికి ఎమ్మెల్యే సుజనా ఆర్థిక సాయం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) ఆదేశాల మేరకు 51 వ డివిజన్ కొత్తపేటలో అనారోగ్యంతో బాధపడుతున్న గొరుసు నాని కి ఆర్థిక సాయం అందించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన గొరుసు నాని పక్షవాతంతో బాధపడుతున్నాడని చికిత్స నిమిత్తం సాయం అందించాలని 51 వ డివిజన్ టిడిపి అధ్యక్షులు కుంచం దుర్గారావు సుజనా దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే ఆర్థిక సాయం అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం ఎన్డీఏ కార్యాలయ సిబ్బంది ఆర్థిక సాయం అందించారు. …

Read More »

ఆ తొమ్మిది గ్రామాల‌కు సాయం అందించాల‌ని క‌లెక్ట‌ర్, ఎమ్మార్వోల‌కు ఆదేశించిన ఎంపి కేశినేని శివ‌నాథ్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : కంచిక‌చ‌ర్ల మండ‌లంలో వ‌ర‌ద ముంపున‌కు గురైన కొన్ని గ్రామాల్లో బాధితుల‌కి ఎన్యూమ‌రేష‌న్ చేయ‌క‌పోవ‌టం వ‌ల్ల న‌ష్ట‌ప‌రిహారం అంద‌లేద‌న్న విష‌యం తెలుసుకున్న ఎంపి కేశినేని శివ‌నాథ్ శుక్ర‌వారం ఎన్టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ సృజ‌న, కంచిక‌చ‌ర్ల మండ‌లం ఎమ్మార్వో జాహ్న‌వి లతో శుక్ర‌వారం మాట్లాడారు. ఎన్యూమ‌రేష‌న్ కాని కొత్త‌పేట‌, గ‌నిఆత్కూరు, చెవిటిక‌ల్లు, కునిక‌పాడు, మున్న‌లూరు, మోగులూరు, అమ‌ర‌వ‌రం, వేముల‌పల్లి, పెండ్యాల గ్రామాల్లో త‌క్ష‌ణం ఎన్యూమ‌రేష‌న్ పూర్తి చేసి న‌ష్ట‌ప‌రిహారం అందేలా చూడాల‌ని ఆదేశించారు. ఎన్యూమ‌రేష‌న్ న‌మోదు విష‌యంలో ఏ గ్రామంలోని …

Read More »

మంచి ఆలోచనలతో మంచి పనులు సుసాధ్యం

-స్వామి సేవానందజీ మహారాజ్ రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : మనసు నిరంతరము మంచి ఆలోచనలు చేస్తూ ఉంటే తద్వారా మంచి మాటలు మాట్లాడుతూ మంచి పనులు చేయగలుగుతామని రాజమండ్రి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్లెన్స్ డైరెక్టర్ స్వామి సేవానందజీ మహారాజ్ పేర్కొన్నారు. శుక్రవారంరాజమండ్రి కేంద్ర కారాగారంలో ” స్వామి వివేకానంద చికాగో” లో ఉపన్యాస దినోత్సవ సందర్భంగా ఖైదీలకు మానసిక పరివర్తన ప్రేరణ ఉపన్యాసాన్ని చేశారు. ఈ కార్యక్రమంలో సేవానందజీ మహారాజ్ మాట్లాడుతూ ఒక వ్యక్తి సంకల్ప బలం ఉంటే ఏ …

Read More »

వ్యక్తుల, సాంస్కృతిక నేపధ్యంలో పర్యటక రంగం అభివృద్ది సాధ్యం

-రాష్ట్ర దేశ ఆర్ధిక మూలలు బలోపేతం లో పర్యటక పాత్ర కీలకం -కలెక్టరు ప్రశాంతి రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : పర్యటక రంగాన్ని అభివృద్ధి పథంలో నడపడం ద్వారా ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరచడం సాధ్యపడగలదని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి స్థానిక నన్నయ యూనివర్సిటీ ఆవరణలో ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలలో ముఖ్యఅతిథిగా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ వ్యక్తుల,  సాంస్కృతిక,  సామాజిక …

Read More »