Breaking News

Monthly Archives: September 2024

రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార కార్యక్రమం తాత్కాలిక వాయిదా

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : Dr. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా రాష్ట్రస్థాయి లో నిర్వహిస్తున్న రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ దినోత్సవం C K Convention, మంగళగిరి లో చేయుటకు ఏర్పాట్లు చేయడం జరిగింది. కానీ వాతావరణం అనుకూలించని కారణంగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు, మంత్రులు, రాష్ట్ర మరియు జిల్లా స్థాయి అధికారులందరూ వివిధ జిల్లాల్లో వచ్చిన వరద బాధితుల సహాయ కార్యక్రమాలలో పాల్గొనడం మరియు పురస్కార గ్రహీతల రవాణా ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర స్థాయిలో నిర్వహించాల్సిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవం …

Read More »

తెలుగు రాష్ట్రాల్లో వరద కష్టాలపై భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు విచారం

-వ్యక్తిగత పెన్షన్ నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు రూపాయలు ఐదు లక్షల చొప్పున సహాయం అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కుండ పోత వర్షాలు, ఉదృతమైన వరదలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాటిల్లుతున్న నష్టం నన్ను తీవ్రంగా కలచివేసింది. ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ కి ఫోన్ చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితిని వివరించి, వెంటనే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాను. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇప్పటికే మాట్లాడానని, అక్కడి ప్రభుత్వాల యంత్రాంగాలతో, కేంద్ర అధికారులు టచ్ లో ఉన్నారని …

Read More »

ఏపీలో ప్రభుత్వేతర రంగంలో ‘అందుబాటు ధర’కే ఆరోగ్య సంరక్షణ సేవలకు భారీ డిమాండ్

-పీపీపీ కింద ఏపీలో 175 ఆసుపత్రులు, మెగా హెల్త్ సిటీ ఏర్పాటు -నియోజకవర్గానికో ఆసుపత్రి ఉండాలనేది ప్రభుత్వ ఆలోచన -ప్రభుత్వాసుపత్రుల్లో రోగనిర్ధారణ, చికిత్స సౌకర్యాల మెరుగుకు కృషి -ఏపీలో పెట్టుబడి అవకాశాలను ఫ్లోరిడా లో వివరించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ -వైద్యఆరోగ్య రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు విశేషమైన అవకాశాలు -రంగరాయ, సిద్ధార్థ, గుంటూరు వైద్య కళాశాలల పూర్వ విద్యార్థుల ద్వైవార్షిక సదస్సులో మంత్రి కీలకోపన్యాసం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని వర్గాల ప్రజలకు ఆరోగ్య …

Read More »

డ్రోన్ల ద్వారా వరద బాధితులకు ఆహారం పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ వద్ద వరద ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయ చర్యలు చేపడుతున్నారు. సీఎం చంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తుండడంతో, అధికారులు, సిబ్బంది ఉరుకులు పరుగులు పెడుతున్నారు. కాగా, బుడమేరు ఉప్పొంగి సింగ్ నగర్, ఇతర ప్రాంతాలు వరదముంపుకు గురయ్యాయి. ఇప్పటికీ అక్కడ వరదనీరు నిలిచి ఉంది. సీఎం చంద్రబాబు ఇక్కడ బోటుపై తిరిగి బాధితులను పరామర్శించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో, వరద బాధితులకు ఆహారం సరఫరా చేయడం సవాలుగా మారింది. దాంతో డ్రోన్లను రంగంలోకి దించాలని సీఎం చంద్రబాబు …

Read More »

రహదారులు, భవనాల రక్షణపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి

-ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలి -ఉన్నతస్థాయి సమీక్షలో అధికారులకు మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఆదేశం అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : వరద ప్రభావిత ప్రాంతాల్లో రహదారులు, భవనాల సంరక్షణ విషయంలో ఆర్ అండ్ బి శాఖ అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలశాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో వరద ప్రభావిత జిల్లాలు కృష్ణా, గుంటూరు, పల్నాడు, పశ్చిమగోదావరి జిల్లాలకు సంబంధించిన …

Read More »

వరదకు ఎదురేది …

-వరద ప్రాంతాల్లో మంత్రి సవితమ్మ పర్యటన -బోటులో వెళ్లి బాధితులను ఒడ్డుకు చేర్చిన మంత్రి -నడుం లోతు నీటిలో బాధితులకు పరామర్శ -అన్ని విధాలా ఆదుకుంటామంటూ భరోసా -చంద్రబాబు స్ఫూర్తితో బాధితులకు అండగా ఉందామంటూ వైద్య సిబ్బందికి, అంగన్వాడీలకు మంత్రి సవిత సూచన అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఊళ్లకు ఊళ్లు మింగేసిన కృష్ణమ్మ ఉగ్రరూపంతో ఉప్పొంగుతోంది. గజ ఈతగాళ్ల సైతం కడలిలా ఎగిసి పడుతున్న కష్ణమ్మను చూసి నీరుగారిపోయారు. ఇవేవీ ఆమెను భయపట్టలేక పోయాయి… సీఎం చంద్రబాబు అప్పగించిన బాధ్యత… వరద …

Read More »

ముంపు ప్రాంతాల్లో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటన

-సహాయక చర్యల్లో వ్యవసాయ అనుబంధ శాఖలు  -మంత్రి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా 175 వెటర్నరీ అంబులెన్స్ లతో పశువుల వైద్యం, జంతు వైద్య శిబిరాల ద్వారా వైద్య సేవలు  -163 బోట్లతో 187 మంది మత్స్యకారులు సహాయక చర్యలు  -కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో రైతులను అప్రమత్తం చేసిన వ్యవసాయ శాఖ  -వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖల అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్షలు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : భారీ వర్షాలు, పొంగుతున్న వాగులు, కాలువల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితిపై …

Read More »

మంత్రి కొలుసు పార్థసారధి, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సమన్వయంతో భారీ వర్షాలకు నష్టాలను నివారించగలిగారు

ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి సమన్వయంతో తీసుకున్న ముందుజాగ్రత్త చర్యలతో జిల్లాలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టాలు కలగకుండా నివారించగలిగాం. వర్షాలు ప్రారంభమై, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటుచేసి భారీ వర్షాల కారణంగా నష్టం వాటిల్లకుండా తీసుకోవలసిన చర్యలపై ముందుగానే దిశా నిర్దేశం చేశారు. …

Read More »

విజ‌య‌వాడ వ‌ర‌ద‌ బాధిత కుటుంబాల‌కు 75,000 అత్య‌వ‌స‌ర మందుల కిట్లు

-ఒక్కో కిట్లో 6 ర‌కాల మందులు -మందులు వాడే విధానాన్ని వివ‌రిస్తూ క‌ర‌ప‌త్రాలు -వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం.టి.కృష్ణ‌బాబు వెల్ల‌డి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : తుపాను, భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల కార‌ణంగా ముంపున‌కు గురైన విజ‌య‌వాడ న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో దాదాపు 75,000 అత్య‌వ‌స‌ర మందుల కిట్ల పంపిణీకి వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లూ చేసింద‌ని ఆ శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం.టి.కృష్ణ‌బాబు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్టు నుండి ఫుడ్ …

Read More »

నేనున్నాను అంటూ భ‌రోసా ఇచ్చిన ఎంపి కేశినేని శివనాథ్

-స్వ‌యంగా స‌హాయ ప‌నుల ప‌ర్య‌వేక్ష‌ణ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అజిత్ సింగ్ న‌గ‌ర్ లో బుడ‌మేరు వ‌ర‌ద ముంపు ప్రాంతాల‌ను సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు ఎంపి కేశినేని శివ‌నాథ్ సోమ‌వారం మ‌ద్యాహ్నం స‌మ‌యంలో మ‌రోసారి ప‌రిశీలించారు. కండ్రిక ప్రాంతంలో ముంపుకి గురైన ప్రాంతాల‌ను ప‌రిశీలించటంతో పాటు, వ‌ర‌దలో చిక్కుకొన్న బాధితుల్ని పున‌రావాస కేంద్రాలు త‌ర‌లించే స‌హాయ చ‌ర్య‌లు వేగవంతం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అలాగే ప్ర‌జ‌లు కూడా అల‌క్ష్యం వ‌హించ‌కుండా ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన పున‌రావాస కేంద్రాల‌కు త‌ర‌లివెళ్లాల‌ని …

Read More »