Breaking News

Monthly Archives: October 2024

పవర్ లిఫ్టింగ్ విజేతలను అభినందించిన శాసనసభ్యులు తంగిరాల సౌమ్య

-క్రీడలు మానసిక ఉల్లాసానికి చాలా ద్రోహదకారం -ఎమ్యెల్యే తంగిరాల సౌమ్య నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : నందిగామ పట్టణం కాకాని నగర్ శాసనసభ్యులు వారి కార్యాలయం నందు ఇటీవల గన్నవరం కేసరపల్లి గ్రామము నందు జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీలలో నందిగామకు చెందిన వారియర్స్ జిమ్ వారు గెలుపొందగా బంగారు పతకాలు, సిల్వర్ మరియు రజత పతకాలు పొందిన లకావత్ వెంకటేష్, పఠాన్ రహీం, బాలసైదులు, నీరజ్ కుమార్, జాన్ మోజేష్, అబ్దుల్ రహీమ్, ఆదిపూడి సాయి కిషోర్, అక్కల రాజేష్, సుమన్, …

Read More »

పదవీ విరమణ చేయు ప్రభుత్వ ఉద్యోగి యొక్క పెన్షన్ ప్రతిపాదనలను 6 నెలలు ముందుగానే డిడిఓ లు పంపాలి

-ప్రిన్సిపాల్ అకౌంటెంట్ జనరల్ సి. చంద్ర మౌళి సింగ్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పదవి విరమణ చేయబోవు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వారి యొక్క పెన్షన్ ప్రతిపాదనలను 6 నెలలు ముందుగానే పంపించేలా డిడిఓలు చర్యలు చేపట్టాలని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ సి. చంద్ర మౌళి సింగ్ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ సమావేశం మందిరంలో పెన్షన్, జి పి ఎఫ్ అదాలత్ కార్యక్రమం ప్రిన్సిపాల్ అకౌంటెంట్ జనరల్ ఏజి మరియు డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీ, ఏపీ వారు సంయుక్తంగా నిర్వహించిన …

Read More »

నవంబర్ 14న రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పలు విద్యా సంబంధిత అంశాలపై విజయవాడ నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ సెక్రటరీ కోన శశిధర్ గారు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయ రామ రాజు, సమగ్ర శిక్ష ఎస్పిడి శ్రీనివాసరావు తదితర అధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వర్చువల్ విధానంలో సమీక్షించి దిశా నిర్దేశం చేయగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు అన్నింటిలో …

Read More »

ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రసూతి మరణాలు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకుండా చర్యలు తీసుకోవాలి

-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ -ప్రసూతి మరణాలకు బాధ్యులుగా తేలితే చర్యలు తప్పవు: కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రసూతి మరణాలు జరగకుండా చూడాలని, అన్ని ఆసుపత్రుల్లో ప్రసవ సమయంలో తప్పనిసరి డెలివరీ ప్రోటోకాల్ పాటించాలని, ప్రసూతి మరణాలకు బాధ్యులుగా తేలితే చర్యలు తప్పవు అని జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో జూన్ 2024 నుండి సెప్టెంబర్ 24 వరకు జరిగిన ప్రసూతి …

Read More »

సిలికా, క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ చేసి తరలిస్తే కఠిన చర్యలు: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో సిలికా, క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ చేసి తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని, మైనింగ్ ప్రక్రియను ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పక్కాగా పర్యవేక్షించాలని మైనింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ నందు మైనింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ సిలికా, క్వార్ట్జ్ మైనింగ్ పై సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సిలికా, క్వార్ట్జ్ మైనింగ్ నిర్వహణ పక్కాగా ఉండాలని ఎలాంటి …

Read More »

21వ అఖిల భారత జాతీయ పశు గణన కార్యక్రమం -2024 తిరుపతి జిల్లా కార్యక్రమంలో పాల్గొన్న పశు సంవర్ధక శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్

-21వ అఖిల భారత పశుగణన 2024 కార్యక్రమం 25 అక్టోబర్ (నేటి) నుండి 28 ఫిబ్రవరి 2025 వరకు నిర్వహణ -పశు గణన సర్వే కు వచ్చే ఎన్యూమరేటర్ కు ప్రజలు పూర్తి సమాచారం అందించి సహకరించాలి -పశు గణన సర్వే జిల్లాలో పక్కాగా నిర్వహించాలి:జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : 21వ అఖిల భారత జాతీయ పశు గణన కార్యక్రమం -2024 ను తిరుపతి జిల్లాలో పశు సంవర్ధక శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్ జిల్లా …

Read More »

నాలుగవ రోజు ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ చెస్ ఫెస్టివల్-2024

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మొత్తం 15 లక్షల నగదు బహుమతితో బి.యన్.కె.యు. 1వ ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ చెస్ ఫెస్టివల్-2024 లో నాలుగవ రోజున ఎనిమిదో రౌండు పోటీలను విజయవాడ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ అజీజ్, ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎం ఎం పని కుమార్, సంయుక్త కార్యదర్శి మందుల రాజీవ్, రోటరీ క్లబ్ మిడ్ టౌన్ వైస్ ప్రెసిడెంట్ నండూరి త్రినాథ్, ఐకాన్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ రాజేంద్ర తదితరులు మొదటి ఎత్తు ప్రారంభించారు. మూడు …

Read More »

నేషనల్ అర్బన్ లైవ్లీ హుడ్ మెషిన్ 2.0 అమలుపై సమీక్ష సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ 2.0 అంశంపై మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ జాయింట్ సెక్రటరీ కుల్దీప్ నారాయణ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. నేషనల్ అర్బన్ లవ్లీ హుడ్ మిషన్ 2.0 ద్వారా కేంద్ర ప్రభుత్వం 6 క్యాటగిరి లో ఉన్న కామన్ ఇంట్రెస్ట్ గ్రూపులకు ఋణ సదుపాయం కల్పించేందుకు పైలట్ ప్రాజెక్ట్ గా విజయవాడ, విశాఖపట్నం ను ఎంపిక …

Read More »

ఈ నెల 27న డయాబ్ ఎండో కాన్ 2024

– ఆధునిక చికిత్సలు, నవీన ఆవిష్కరణలపై వైద్య ప్రముఖుల ప్రసంగాలు – ప్రఖ్యాత ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ కృష్ణ శేషాద్రికి గోల్డ్ మెడల్ ప్రదానం – యలమంచి డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ యలమంచి సదాశివరావు – డయాబ్ ఎండో కాన్ 2024 బ్రోచర్ ఆవిష్కరణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 27వ తేదీ ఆదివారం నాడు డయాబ్ ఎండో కాన్ 2024 వైద్య సదస్సును నిర్వహిస్తున్నట్లు యలమంచి డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ చైర్మన్, ప్రఖ్యాత మధుమేహ వైద్య నిపుణులు డాక్టర్ …

Read More »

అనధికార ఆక్రమణలను తొలగించండి

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అనధికార ఆక్రమణలను తొలగించేందుకు ప్రతి ఒక్క సెక్రటరీ దగ్గర మాస్టర్ ప్లాన్ ఖచ్చితంగా ఉండాలని, మున్సిపల్ మరియు ప్రభుత్వ స్థలాలను సంరక్షించుకోవాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, గురువారం ఉదయం ప్రధాన కార్యాలయంలో, నూతన భవనం లో గల సమావేశంలో ప్లానింగ్ సిబ్బందితో సమీక్ష సమావేశం లో అన్నారు. అనధికార ఆక్రమణలను అడ్డుకోవాలని కమిషనర్ అన్నారు. అనధికార బ్యానర్లు, హోర్డింగ్ లు ఎక్కడా లేకుండా చర్యలు …

Read More »