Breaking News

Monthly Archives: October 2024

పార్లమెంట్ సభ్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన కమిషనర్ పులి శ్రీనివాసులు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అర్బన్ ల్యాండ్ రికార్డ్ కోసం సర్వే- రీ సర్వేలో ఆధునిక సాంకేతిక విధానాల అమలుపై న్యూ డిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ జరుగుతున్న అంతర్జాతీయ వర్క్ షాప్ ముగింపు సభకు మంగళవారం ముఖ్య అతిధిగా పాల్గొన్న కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి, గుంటూరు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్. ఈ సందర్భంగా మంత్రి గారు సర్వే-రీ సర్వేపై వర్క్ షాప్ …

Read More »

అంతర్జాతీయ వర్క్ షాప్ విజయవంతం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అర్బన్ ల్యాండ్ రికార్డ్ కోసం సర్వే- రీ సర్వేలో ఆధునిక సాంకేతిక విధానాల అమలుపై ఈ నెల 21, 22 తేదీల్లో న్యూ డిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో జరిగిన అంతర్జాతీయ వర్క్ షాప్ విజయవంతంగా జరిగిందని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ భూ వనరులు, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ వర్క్ షాప్ లో నేషనల్ జియో …

Read More »

ప్రతిభావంతులైన పేద ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు డీఎస్సీకి ఉచిత శిక్షణ నమోదుకై గడువు పోడిగింపు

-ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబరు 25 వరకు అవకాశం -యం. సందీప్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రతిభావంతులైన పేద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సాంఘిక గిరిజన సంక్షేమ శాఖల అధ్వర్యంలో ఉచిత డీ ఎస్సీ శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టడం జరిగినదని ఇన్చార్జి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి యం. సందీప్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిభావంతులైన పేద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు డీఎస్సీ నందు ఉత్తమ ఫలితాలు పొందేందుకు ప్రభుత్వం ఉచితంగా శిక్షణ కార్యక్రమం …

Read More »

తుని మండలం అగరుబత్తీ తయారీ యూనిట్ సందర్శన

-వ్యర్థ పూలతో అగరుబత్తులు యూనిట్ ఏర్పాటు దిశగా అడుగులు -డి ఆర్ డి ఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ మూర్తి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ పరిరక్షణ, వ్యర్థ పూల నుంచి ఆదాయ వనరుగా యూనిట్ ఏర్పాటు దిశగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వారి ఆదేశాల మేరకు తునిలో ఏర్పాటు చేసిన అగరుబత్తులు తయారీ యూనిట్ ను సందర్శించడం జరిగిందని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్ వి వి ఎస్ మూర్తి తెలియ చేశారు. మంగళవారం తుని …

Read More »

బాల కార్మికుల ను గుర్తించేందుకు పోలీసుల సహకారం

-బాల కార్మికుల సమాచారం 94925 55064  , 949255 55065 ,  94925 55066 ,  94925 55067 నంబర్ల కి ఇవ్వండి -కమిటి సభ్యులు సమక్షంలో గోడ ప్రతులను ఆవిష్కరణ -గుర్తించిన బాల కార్మికులకు వైద్య పరీక్షలు ఏర్పాటు -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బాల కార్మిక వ్యవస్థ లేకుండా చూడాలని, అందుకోసం క్షేత్ర స్థాయిలో దుర్బలమైన ప్రాంతాల పై మరింతగా అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్, టాస్క్ ఫోర్స్ కమిటి చైర్మన్ పి …

Read More »

సక్షం అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు పై దృష్టి పెట్టాలి

-15 వ ఆర్ధిక సంఘం నిధులను సద్వినియోగం చేసుకోవాలి -సమగ్ర కార్యాచరణ ప్రణాళిక తో సమన్వయ శాఖలు ప్రతిపాదనలు అందజేయాలి -మరుగుదొడ్ల నిర్మాణం, శుద్ధమైన త్రాగునీటి వ్యవస్థ, వాల్ పెయింటింగ్ లు 45 రోజుల్లో పూర్తి చెయ్యాలి -కలక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పిల్లలు, కౌమారదశలో ఉన్న బాలికలు, గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులలో పోషకాహార లోపం యొక్క సవాళ్లను పరిష్కరించడానికి సక్షం అంగన్వాడీ మరియు పోషణ్ 2.0 సమీకృత పోషకాహార మద్దతు కార్యక్రమం అమలు , …

Read More »

నామవారం రెవిన్యూ గ్రామ సభలు హాజరైన కలెక్టర్ పి ప్రశాంతి

రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : రెవిన్యూ గ్రామ సభలు నిర్వహించే క్రమంలో సంబంధిత గ్రామాలకు చెందిన రెవిన్యూ రికార్డులతో హజరు కావాలని , ఫిర్యాదులు చేసే వ్యక్తులు నిర్ధారిత పత్రాలు తీసుకొని రావాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. మంగళవారం రాజానగరం మండలం నామవరం గ్రామంలో రీ సర్వే గ్రామ సభకు కలెక్టర్ హాజరుకావడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి రైతులతో, భూ యజమానులతో ముఖా ముఖి మాట్లాడుతూ, రీ సర్వే ప్రాజెక్ట్ లో భాగంగా సర్వే పూర్తి …

Read More »

గ్రామ స్థాయి జన సురక్ష కార్యక్రమం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ, ఆర్ధిక సేవల విభాగము వారి ఆదేశానుసారం తూర్పు గోదావరి జిల్లాలో గ్రామ స్థాయి జన సురక్ష కార్యక్రమం అక్టోబరు 15 నుంచి 2025 జనవరి15 వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయ ఛాంబర్ లో గ్రామ స్థాయి జన సురక్ష కార్యక్రమం గోడప్రతిని కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి పథకం యొక్క ప్రయోజనాలను తెలియ …

Read More »

కనీస వేతనాల చట్టం అమలు అయ్యేలా కార్మిక శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి…

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో కనీస వేతనాల చట్టం అమలు అయ్యేలా కార్మిక శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని, తిరుపతి జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలలో ఎన్ ఎం ఆర్ / మజ్దూర్ కార్మికుల కనీస వేతనాలు 2024-25 సంవత్సరానికి గాను కమిటీ ఆమోదించిన కనీస వేతనాలు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం రాత్రి జిల్లాలో 2024-25 సంవత్సరానికి గాను కనీస వేతనాల సవరణకు సంబంధించిన కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కార్మిక శాఖ …

Read More »

ఆర్టీసీ కి చెందిన ఇద్దరు ఉద్యోగుల మెడికల్ ఇన్వ్యాలిడేషన్ కేసులకు ఆమోదం తెలిపిన కమిటీ: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్టీసీ కి చెందిన ఇద్దరు ఉద్యోగుల మెడికల్ ఇన్వ్యాలిడేషన్ కేసులను కమిటీ ఆమోదించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం ఆర్టీసీ కి సంబంధించిన ఇద్దరు ఉద్యోగులు ఒకరు క్యాన్సర్ తో బాధపడుతున్న ఉద్యోగి, మరొకరు పక్షవాతంతో నడవలేని పరిస్థితిలో ఉన్న కేసుకు సంబంధించిన ఉద్యోగులను పరిశీలించి మెడికల్ ఇన్వాలిడేశన్ ప్రతిపాదనలను మెడికల్ ఇన్వ్యాలిడేషన్ కమిటీ ఆమోదించింది. ఈ సమావేశంలో డిఎంహెచ్ఓ శ్రీహరి, జిల్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇంఛార్జి అధికారి జగదీష్, కలెక్టరేట్ …

Read More »