-ఈనెల 14 15 తేదీల్లో విజయనగరంలో జరిగే పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు రండి -ముఖ్యమంత్రి క్యాబినెట్ మంత్రులందరినీ ఆహ్వానించిన మంత్రి కొండపల్లి,ఎంపీ కలిశెట్టి, ఎమ్మెల్యే అధితి గజపతి రాజు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 14 15 తేదీలల్లో విజయనగరంలో జరిగే పైడితల్లి అమ్మవారి తోల్లేళ్లు, సిరిమానోత్సవం కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తోపాటు క్యాబినెట్ సహచరులు అందరినీ ఆహ్వానిస్తూ వారికి రాష్ట్రమంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో విజయనగరం యంపి, ఎమ్మెల్యే కలిశెట్టి అప్పలనాయుడు, పూసపాటి అధితి …
Read More »Monthly Archives: October 2024
గత ప్రభుత్వ హయాంలో దారుణహత్యకు గురైన మైనర్ బాలుడు ఉప్పాల అమర్ నాథ్ కుటుంబానికి న్యాయం చేస్తాం
-హోం మంత్రి వంగలపూడి అనిత -నిందితులకు త్వరగా శిక్షపడేలా చూడాలని హోం మంత్రిని కోరిన బాధిత కుటుంబం, జై గౌడ సేన నాయకులు -కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేసి వేగంగా దర్యాప్తు చేయాలని డీజీపీని ఆదేశించిన హోంమంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వ హయాంలో దారుణహత్యకు గురైన మైనర్ బాలుడు ఉప్పాల అమర్ నాథ్ కుటుంబానికి న్యాయం చేస్తామని హోం మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. తన సోదరిని వేధించవద్దని వారించిన కారణంగా బాపట్ల జిల్లా చెరుకుపల్లి …
Read More »ఘనంగా ఆల్ ఇండియా సబ్ జూనియర్ ర్యాంకింగ్ బ్యాట్మెంటన్ టోర్నమెంట్
-విజేతలకు మెడల్స్ అందజేసిన రాష్ట్ర రవాణా,యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చెన్నుపాటి రామకోటయ్య మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో యోనేక్స్ సన్ రైస్ కాలగార నాగబాబు మెమోరియల్ వారు ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా సబ్ జూనియర్ ర్యాంకింగ్ బ్యాట్మెంటన్ టోర్నమెంట్ 2024 కార్యక్రమానికి రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి బ్యాట్మెంటన్ ఆటల పోటీలను వీక్షించారు. అండర్ 16 – 17 లో …
Read More »పిఠాపురం సి.హెచ్.సి.లో వైద్యులు, సిబ్బంది నియామకం
-ఎక్స్ రే యూనిట్ పునరుద్ధరణ -రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి… అధికారులతో సమీక్ష పిఠాపురం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన నియోజకవర్గం పిఠాపురంలో సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అధికారుల బృందాన్ని పిఠాపురం నియోజకవర్గానికి పంపించి క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలపై పరిశీలన చేయించి నివేదికలు పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా పిఠాపురంలోని కమ్యునిటీ హెల్త్ సెంటర్ (సి.హెచ్.సి.)లో వైద్యులు, సిబ్బంది కొరత, ఎక్స్ రే యూనిట్ పని …
Read More »వరద నీటిని బయటకు విడుదల చేయడంతో పెను ప్రమాదం తప్పింది…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నేడు అమరావతిలోని సచివాలయంలో రోడ్లు మరియు రవాణా, పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డిని ఆయన కార్యాలయంలో రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరువురు మంత్రుల భేటీ సందర్భంగా విజయవాడ నగర పరిధిలో గత నెలలో బుడమేరు వరదల కారణంగా పలు ప్రాంతాల్లో ఆర్ & బీ రోడ్లు మునిగిపోయిన అంశం చర్చకు వచ్చింది. ముఖ్యంగా నాడు నూజివీడు వెళ్లే రోడ్డును పలు చోట్ల …
Read More »“శక్తి విజయోత్సవం”
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్త్రీ శక్తికి సన్మానం, ఆధ్యాత్మికత, సాంస్కృతిక పరంపరలను ఘనంగా చాటే “శక్తి విజయోత్సవం” అక్టోబర్ 11, 12,13 తేదీలలో విజయవాడలోని పున్నమి ఘాట్ వద్ద కన్నుల పండగలా జరుగుతుందని సంస్థ డైరెక్టర్ అభిషిక్త్ కిషోర్ గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు . ఈ మహోత్సవం దసరా పర్వదినం సందర్భంగా శ్రీ దుర్గాదేవి యొక్క నవ శక్తి స్వరూపాలను స్మరించేందుకు, మహిళల్లో అంతరంగాన నిబిడీకృతమై ఉన్న శక్తి, ధైర్యం, …
Read More »జీవితం చివరి వరకు విలువలు పాటించిన వ్యక్తి రతన్ టాటా
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దిగ్గజ పారిశ్రామిక వేత్త, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, టాటా సన్స్ చైర్మన్ రతన్ టాటాకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్, అధికారులు మరియు సిబ్బంది నివాళులు అర్పించారు. గురువారం మంగళగిరి పరిశ్రమల శాఖ కమీషనర్ కార్యాలయంలో రతన్ టాటా చిత్రపటానికి నివాళులు అర్పించిన డైరెక్టర్ డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ రతన్ టాటా వారితో తాను కలిసిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు. రతన్ టాటా ఎంతో గొప్ప వ్యక్తని, గ్లోబల్ పేస్ …
Read More »ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో ఈ నెల 21న ఐరన్ పైపుల వేలం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాల, ఆసుపత్రి నందు నిరుపయోగమైన సుమారు 500 కేజీల ఇనుప పైపుల బహిరంగ వేలం కళాశాల ఆవరణలో ఈ నెల 21(సోమవారం)న ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం పాట నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బహిరంగ వేలం పాటలో పాల్గొనే పాటదారులు ప్రిన్సిపల్, ప్రభుత్వ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి పేరు మీద రూ. 500 డీడీ తీసి సమర్పించాలని …
Read More »నారీశక్తి ఉత్సవం” కు హాజరుకావాలని మంత్రి కందుల దుర్గేష్ కు టూరిజం ఎండీ అభిషిక్త్ కిషోర్ ఆహ్వానం
-మంత్రి కందుల దుర్గేష్ కు ఆహ్వాన పత్రిక అందజేసిన ఎండీ అభిషిక్త్ కిషోర్, ఐఏఎస్.. సానుకూలంగా స్పందించిన మంత్రి దుర్గేష్ -టూరిజం శాఖ ఆధ్వర్యంలో విజయవాడ పున్నమి ఘాట్ సమీపంలోని బబ్బూరి గ్రౌండ్ లో ఈనెల 11,12,13 తేదీల్లో నారీశక్తి ఉత్సవం -అధ్యాత్మికతను స్ఫురించేలా, మహిళా సాధికారతను చాటేలా 3 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు -దసరా శరన్నవరాత్రులు పురస్కరించుకొని వివిధ రంగాల్లో ప్రతిభాపాటవాలు కనబర్చిన మహిళలకు పురస్కారాల ప్రదానం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకొని రాష్ట్ర టూరిజం …
Read More »శ్రీ రతన్ టాటాకు క్యాబినెట్ నివాళి
-రతన్ టాటా మృతి దేశానికే తీరని లోటన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దిగ్గజ వ్యాపార వేత్త రతన్ టాటా మృతికి ఎపి క్యాబినెట్ సంతాపం తెలిపింది. రతన్ టాటా దేశానికి చేసిన సేవలను సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా ప్రస్తావించారు. విలువలతో కూడిన వ్యాపారంతో రతన్ టాటా ఒక పెద్ద బ్రాండ్ ను సృష్టించారని ముఖ్యమంత్రి కొనియాడారు. సంపదను సృష్టించడమే కాకుండా…ఆ సంపదను సమాజంలో అన్ని వర్గాలకు చేరేలా పద్మవిభూషన్ రతన్ టాటా ఎంతో కృషి చేశారని …
Read More »
Prajavartha Online Telugu News