Breaking News

Daily Archives: May 7, 2026

వ్యవసాయ, ఆక్వా వ్యర్థాలతో అద్భుత సంపద సృష్టి.. పశ్చిమ గోదావరి జిల్లా ‘సర్క్యులర్ ఎకానమీ బ్లూప్రింట్’ ను ప్రశంసించిన సిఎం!

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేసిన ప్రజెంటేషన్ “సర్క్యులర్ ఎకానమీ బ్లూప్రింట్” అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షించింది.వ్యవసాయం మరియు ఆక్వా రంగాల ద్వారా వచ్చే వ్యర్థాలను పర్యావరణానికి ముప్పుగా కాకుండా, అత్యంత విలువైన బయో-ఉత్పత్తులుగా, సంపదగా ఎలా మార్చవచ్చో ఆమె తన ప్రజంటేషన్‌లో కళ్లకు కట్టినట్లు వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యవసాయం పరంగా ఎంతో సంపన్నమైనదని, 2026 నాటికి తలసరి ఆదాయం రూ. 3.5 లక్షలు దాటబోతోందని, కానీ …

Read More »

మానికొండ – తరిగొప్పల రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు

-రూ. 2.5 కోట్ల వ్యయంతో పునర్నిర్మాణం కానున్న మానికొండ – తరిగొప్పల రహదారి -20 రోజుల్లో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు ఎమ్మెల్యే ఆదేశం -గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో రోడ్లు దెబ్బతిన్నాయని యార్లగడ్డ విమర్శ -కూటమి ప్రభుత్వంపై విశ్వాసంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయని వ్యాఖ్య గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వం కారణంగా రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారయ్యిందనీ ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. గురువారం ఉంగుటూరు మండలం …

Read More »

నిడమర్రులో ఏర్పాట్లు పరిశీలించిన జాయింట్ కలెక్టర్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 13వ తేదీన మంగళగిరి మండలం నిడమర్రు గ్రామంలో పర్యటించనున్నదృష్ట్యా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, సి.ఆర్.డి.ఏ అదనపు కమిషనర్ ఎ.భార్గవ తేజ ఏర్పాట్లను గురువారం పరిశీలించారు. ఏర్పాట్లలో ఎటువంటి లోటు పాటు లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి కే శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

Read More »

కేడీసీసీ బ్యాంక్⁠ ఆధ్వర్యంలో మజ్జిగ, తాగునీరు పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో బాటసారుల దాహార్తిని తీర్చేందుకు కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్⁠ చైర్ పర్సన్ నెట్టెం రఘురామ్ పిలుపు మేరకు ఎన్టీఆర్ జిల్లాలో పలుచోట్ల ఘనంగా చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. సొసైటీ చైర్‌పర్సన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు నాయకుల ఆధ్వర్యంలో, జీఎం రంగబాబు పర్యవేక్షణలో స్థానిక బ్రాంచ్ చీఫ్ మేనేజర్లు, సిబ్బంది సమన్వయంతో ఈ సేవా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా నందిగామ నియోజకవర్గంలోని చందర్లపాడు, కంచికచర్ల, పెద్దాపురం ప్రాంతాల్లో, …

Read More »

పెండింగ్ సమస్యల తక్షణ పరిష్కారానికే ప్రభుత్వం ప్రాధాన్యం

– కుంటముక్కల గ్రామంలో “ఒక నెల – ఒక గ్రామం” కార్యక్రమం – అడిష‌న‌ల్ సీసీఎల్ఏ జె.వెంక‌ట‌ముర‌ళి, జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇస్తోందని అడిషనల్ సీసీఎల్ఏ జె.వెంక‌ట‌ముర‌ళి, జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ అన్నారు. గురువారం జి.కొండూరు మండ‌లం, కుంటముక్కల గ్రామంలో నిర్వహించిన “ఒక నెల – ఒక గ్రామం నాలుగు పర్యటనలు” కార్యక్రమానికి వెంక‌ట ముర‌ళి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా …

Read More »

జ‌ల‌ధార‌తో చెరువుల‌కు నూత‌న జీవం

– ఫీడర్ ఛానళ్ల పునరుద్ధరణతో బ‌హుళ ప్ర‌యోజ‌నాలు – సాగునీటితో పాటు భూగ‌ర్భ జ‌లాల వృద్ధికి దోహ‌దం – ప్ర‌భుత్వ జ‌ల సంర‌క్ష‌ణ కార్య‌క్ర‌మాల‌పై స‌ర్వ‌త్రా హ‌ర్షం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార–జలహారతి కార్యక్రమం కింద ఎన్‌టీఆర్ జిల్లాలో నీటి వనరుల అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా జి.కొండూరు మండలంలోని చెరువుమాధవరం గ్రామ పరిధిలో ఉన్న గ్రంథివాని చెరువుకు సంబంధించిన ఫీడర్ ఛానల్ ఫునరుద్ధ‌ర‌ణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ ఫీడర్ …

Read More »

ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్లానింగ్ విభాగానికి ప్రత్యేక శిక్షణ APDPMS ట్రైనింగ్ 2.0 కార్యక్రమం నిర్వహణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు పట్టణ ప్రణాళిక సేవలను మరింత వేగవంతంగా, పారదర్శకంగా మరియు సులభతరంగా అందించాలనే లక్ష్యంతో పురపాలక మరియు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్లానింగ్ విభాగ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ APDPMS ట్రైనింగ్ 2.0 కార్యక్రమాన్ని గురువారం విజయవాడలో నిర్వహించారు. రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, రాజమండ్రి ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం, వన్‌టౌన్‌లో జరిగిన ఈ శిక్షణ కార్యక్రమం ఉదయం 10 …

Read More »

నగరాభివృద్దే ప్రథమ లక్ష్యం, ప్రజల క్షేమమే ప్రధాన ధ్యేయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరాభివృద్దే ప్రథమ లక్ష్యం, ప్రజల క్షేమమే ప్రధాన ధేయంగా ప్రజా ప్రతినిధులు, వియంసి అధికారుల మధ్య సమన్వయ సమావేశాని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర నిర్వహించారు. గురువారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్, తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, సెంట్రల్ మరియు పశ్చిమ నియోజకవర్గం ప్రతినిధులతో శాఖధిపతుల సమక్షంలో ఈ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ నగరపాలక …

Read More »

రానున్న వర్షాకాలం దృశ్య నగరంలోని డీసిల్టింగ్ పనులను పూర్తిస్థాయిలో చేస్తున్నాం

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న వర్షాకాలం దృశ్య నగరంలోని డీసిల్టింగ్ పనులను పూర్తిస్థాయిలో చేస్తున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా రమేష్ హాస్పటల్ రోడ్డు, గురునానక్ కాలనీ రోడ్, ఆటోనగర్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్, పంట కాలువ రోడ్డు, పటమట ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని డీసిల్టింగ్ ప్రక్రియను పూర్తిస్థాయిలో చేయాలని, ఎప్పటికప్పుడు డీసిల్టింగ్ పనులను అధికారులు …

Read More »

ఉచిత ఇసుక ఉత్తిమాటేనా …

-ఇసుక అక్రమాలను నిరోధించి సక్రమంగా అందించాలి -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానంలో పలు అక్రమాలు, దందాలు చోటుచేసుకుంటూ ‘ఉచిత ఇసుక ఉత్తిమాటగా’ మిగిలిపోతోందని, ఇసుక అక్రమాలను నిరోధించి సక్రమంగా వినియోగదారులకు అందించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈశ్వరయ్య నేడొక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ఉచిత ఇసుక’ విధానం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెను …

Read More »