శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పట్టువస్త్రాలను సమర్పించిన మంత్రి కొడాలి నాని…


-అంతరాలయంలో వైభవంగా అభిషేక పూజలు

గుడివాడ / ముదినేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
ముదినేపల్లి మండలం సింగరాయపాలెంలో వేంచేసి ఉన్న శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్ల దేవస్థానంలో స్వామివారికి సోమవారం రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) పట్టువస్త్రాలను సమర్పించారు. ముందుగా కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే మాధవీలతతో కలిసి ఆలయానికి వచ్చిన మంత్రి కొడాలి నానికి ఆలయ అర్చకులు వేద మంత్రాల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించిన అనంతరం అంతరాయలంలో అభిషేక పూజలు జరిపారు. పుట్టలో పాలు పోసి శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ప్రార్థించారు. ఈ సందర్భంగా దేవాదాయశాఖ సహాయ కమిషనర్ కేవీ గోపాలరావు మంత్రి కొడాలి నానిని, ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావును, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ మాధవీలతను, వడ్డీ కార్పోరేషన్ చైర్ పర్సన్ ఎం గాయత్రీ సంతోషిలను శేషవస్త్రాలతో సత్కరించారు. అనంతరం వేద పండితులు మంత్రి కొడాలి నానికి ఆశీర్వచనం అందించారు. సహాయ కమిషనర్ గోపాలరావు స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కైకలూరు మండల ప్రముఖుడు అడవి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పరిసరాల పరిశుభ్రత మనఅందరి బాధ్యత..పరిశుభ్రతతోనే ఆరోగ్యం…

-పత్రి ఒక్కరిలో స్వచ్ఛత పై అవగాహన కలిగించాలి.. -స్వచ్ఛత-శుభ్రత పై ప్రజలు నైతిక బాధ్యత వహించాలి.. -మురుగు కాలువగట్లపై చెత్తను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *