Breaking News

వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులకు చంద్రికకిరణ్ ల వివాహ ఆహ్వానం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని ఆయన నివాసంలో వైసీపీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కుటుంబ సమేతంగా కలిశారు. ఈ నెల 23 న లబ్బీపేటలోని ఎస్. ఎస్. కన్వెన్షన్ సెంటర్ నందు జరగనున్న తమ ద్వితీయ కుమార్తె చంద్రిక వివాహ వేడుకకు హాజరు కావలిసిందిగా దంపతులను ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వానపత్రిక అందజేసి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించవలసిందిగా కోరారు. పెళ్లి పత్రిక స్వీకరించిన ఆయన తప్పకుండా వివాహానికి వస్తానని తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *