Breaking News

ఇంతవరకు 4.05 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం… :  జెసి డా. కె. మాధవీలత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా జిల్లాలో రబీ ధాన్యం కొనుగోలు భాగంగా 34,675 రైతుల నుంచి 4,05,468 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జాయింట్ కలెక్టర్ డా.కె.మాధవీలత తెలిపారు. శనివారం నగరంలోని జెసి క్యాంప్ కార్యాలయం నుంచి నిర్వహించిన డయల్ యువర్ జెసిలో ధాన్యం కొనుగోలు సంబంధించి 4గురు రైతులు తెలిపిన సమస్యలను జెసి మాధవీలత తెలుసుకొని వాటిని నివృత్తి చేశారు. ఈ సందర్భంగా జెసి మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 34,675 మంది రైతుల నుంచి రూ. 708.39 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. ఇందులో ఇప్పటికే రూ. 704.01 కోట్లను రైతులకు చెల్లించగా మరో రూ. 4.38 కోట్లను రైతులకు చెల్లించేందుకు అమోదించడం జరిగిందని త్వరలో సంబంధిత రైతుల ఖాతాలకు జమ చేయబడుతుందన్నారు. 3 మండలాల నుంచి 4గురు రైతులు మాట్లాడుతూ తాము విక్రయించిన ధాన్యానికి వెంటనే నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకోమని కోరారు. దీనిపై జేసి స్పందిస్తూ త్వరలోనే సంబంధిత సొమ్ము జమ చేయడం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో పౌర సరఫరా సంస్థ జిల్లా మేనేజర్ కె.రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

జూన్ నాటికి 3 లక్షల గృహాలను ప్రారంభించేందుకు చర్యలు

-పిఎంఎవై 1.0 పధకం గడువు మరో ఏడాది పాటు పొడిగింపు -ఎస్సీ,ఎస్టీ,పివిటిజి,బిసీ గృహ లబ్దిదారులకు అదనపు సాయం -గృహ నిర్మాణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *