రాష్ట్ర‌ప‌తి అల్పాహార విందుకు హాజరైన‌ ఎంపి కేశినేని శివ‌నాథ్

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి భవన్ లో ఇచ్చిన అల్పాహార విందు కార్యక్రమంలో కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ , స్పీకర్ ఓం బిర్లా, బి.జె.పి జాతీయ అధ్యక్షుడు ఎంపి జెపి న‌డ్డా, కేంద్ర‌మంత్రులు, స‌హ‌చ‌ర‌ ఎంపిల‌తో క‌లిసి విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) సోమ‌వారం పాల్గొన్నారు. రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దీ ముర్ము ఈ అల్పాహార విందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ , కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌, హార్యానా రాష్ట్రాల‌కు చెందిన ఎంపిల‌ను ఆహ్వానించారు. ఈ విందులో పాల్గొన్న ఎంపిలంద‌ర్నీ క‌లిసి వారి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ విశేషాల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ అల్పాహార విందుకు ఆహ్వానించినందుకు ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దీ ముర్ముకి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదములు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించాలి…

-పిఆర్సి చైర్మన్ ని వెంటనే నియమించాలి. -పెండింగ్ లో ఉన్న డిఏలు మంజూరు చేయాలి. -జేఏసీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *