Breaking News

బదిలీ ఉత్తర్వులు పొందిన ఆదర్శపాఠశాల సిబ్బంది నేడే (18.6.25) విధుల్లో చేరాలి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆదర్శ పాఠశాలల్లో పని చేస్తూ బదిలీ ఆర్డర్ తీసుకున్న ప్రిన్సిపాల్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు కొత్త పాఠశాలల్లో నేడు (18.6.25) విధుల్లో చేరాలని పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియను వెబ్ కౌన్సిలింగ్ ద్వారా విజయవంతంగా, పారదర్శకంగా ప్రభుత్వం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఆదర్శ పాఠశాలల (మోడల్ స్కూల్స్) నుండి సాధారణ బదిలీ ప్రక్రియలో 2608 రెగ్యులర్ ఉపాధ్యాయ సిబ్బందికి గాను 1312 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోగా, దీనిలో 1009 మంది ఉపాధ్యాయులు వెబ్ ఎంపికల ప్రకారం వారు కోరుకున్న పాఠశాలలకు బదిలీ చేసినట్లు తెలిపింది. వీళ్లలో 792 మంది ఉపాధ్యాయులకు తప్పనిసరి బదిలీలు, 217 మందికి అభ్యర్థన బదిలీలు జరిపినట్లు పేర్కోంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *