మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మైలవరం గ్రామానికి చెందిన పసుపులేటి మేఘన అత్యంత ప్రతిభ కనబరిచి సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (సి టి యూ ) విజయనగరం లో సీటు సాధించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టి ఏ) దేశవ్యాప్తంగా నిర్వహించిన సెంట్రల్ యూనివర్సిటీ కామన్ టెస్ట్ ( సి యు ఈ టి) కు హాజరై ఆన్లైన్ ద్వారా జరిగిన పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ ఆధారంగా సైన్స్ గ్రూపులో బీఎస్సీ బోటనీ స్పెషలైజేషన్ సీటును సెంట్రల్ ట్రైబుల్ యూనివర్సిటీ మెరిట్ లిస్టు ద్వారా సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ( సి టి యూ) లో సీటు సాధించిందని తల్లిదండ్రులు పసుపులేటి చైతన్య, రేణుకదేవి, తెలిపారు విద్యార్థిని మేఘన ను పలువురు అభినందించారు.
Prajavartha Online Telugu News