విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ ప్రధాన ఆసుపత్రిలో ఇన్ చార్జ్ సిఎంఎస్ గా విధులు నిర్వహిస్తున్న ఎండి నజీర్ హుస్సేన్ స్థానంలో ప్రస్తుతం లాలగూడలో విధులు నిర్వహిస్తున్న డా.శ్రీలక్ష్మి విజయవాడలో సిఎంఎస్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సోమవారం ఎస్ సిఆర్ఎంయు డివిజన్ కార్యదర్శి జిఎన్.శ్రీనివాసరావు, అధ్యక్షులు లీల, మెడికల్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్కె షౌకద్ అలి, అసిస్టెంట్ కార్యదర్శి తిరుపతి స్వామి, ఛైర్మన్ విజయ మాణిక్య తదితరులు మర్యాద పూర్వకంగా సిఎంఎస్ శ్రీలక్ష్మిని కలిసి శాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా సిఎంఎస్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ అందరికీ అందుబాటులో ఉంటానని ఎవరికి ఏ సమస్య వచ్చినా తనను సంప్రదించవచ్చని తెలిపారు.
Prajavartha Online Telugu News