గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమంలో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో “జిఎస్టీ 2.0 సంస్కరణల వల్ల భవిష్యత్ ఆర్ధిక ధోరణులు” అంశంపై ఆర్ధిక నిపుణులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, వ్యాపారవేత్తలతో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు జిఎంసి కౌన్సిల్ సమావేశ మందిరంలో సెమినార్ జరుగుతుందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో జిఎస్టీ, జిఎంసీ అధికారులు పాల్గొంటారని, నగరంలోని చార్టర్డ్ అకౌంటెంట్లు, వ్యాపారవేత్తలు పాల్గొని చర్చలో పాల్గొని, తమ సూచనలు, అభిప్రాయాలు తెలియచేయాలని కోరారు.
Prajavartha Online Telugu News