అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం (23-04-26) రాష్ట్రంలో 95 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 101 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఎల్లుండి 50 తీవ్ర, 52 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.
బుధవారం కడపలో గరిష్ఠంగా 44.4°C నమోదైందని అలాగే 202 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు పేర్కొన్నారు. ప్రజలు తప్పనిసరిగా ఎండ తీవ్రత పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎండ తీవ్రత సమాచారం కోసం ఏపిఎస్డీఎంఏలోని కంట్రోల్ రూమ్ 🆘112 📞1070 ☎️1800 425 0101 నెంబర్లు సంప్రదించవచ్చని తెలిపారు.
రేపు తీవ్రవడగాల్పులు వీచే జిల్లాలు:
శ్రీకాకుళం 19, విజయనగరం 24, మన్యం 3, అల్లూరి 5, పోలవరం 8, విశాఖ1, అనకాపల్లి 13, కాకినాడ 10, తూర్పుగోదావరి 6, ఏలూరు 3, ఎన్టీఆర్ 3 మండలాల్లో(95) తీవ్ర వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించారు.
వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతల నమోదైయ్యే మండలాల పూర్తి వివరాలు లింక్లో:
https://apsdma.ap.gov.in/files/f203efd5392174a806f6f841e7ee4fa5.pdf
బుధవారం కడపలో 44.4°C, మన్యం(జి) సాలూరులో 44.1°C, నంద్యాల(జి) ఆళ్లగడ్డలో 44°C, శ్రీకాకుళం(జి) కొత్తూరులో 43.5°C, విజయనగరం(జి) దత్తిరాజేరులో 43.5°C, అనంతపురం(జి) రాయదుర్గంలో 43.4°C, ప్రకాశం(జి) కొప్పెరపాడులో 43.4°C, అనకాపల్లి(జి) దేవరపల్లె, తిరుపతి(జి) బేస్తపల్లి లో 43.3°C, కాకినాడ(జి) కరపలో 43.2°C, విశాఖ(జి) పద్మనాభంలో 43°C, పల్నాడు(జి) గురజాలలో 42.9°C, నెల్లూరు(జి) కొమ్మిపాడు 42.8°C, మార్కాపురం(జి) తిప్పయ్యపాలెం,శ్రీసత్యసాయి(జి) కొత్తచెరువులో 42.5°C, అన్నమయ్య(జి) నూలివీడులో 42.2 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు.
ఎండలో బయటకు వెళ్లేటప్పుడు చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలన్నారు. అదేవిధంగా కళ్ళ రక్షణ కోసం నాణ్యమైన సన్ గ్లాసెస్ ఉపయోగించాలన్నారు. గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదన్నారు. నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు,మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.
ఆకస్మికంగా ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు.
Prajavartha Online Telugu News