-జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశతో యువ ఫౌండర్ల కీలక భేటీ
-విద్యార్థులకు నెట్వర్కింగ్, అవకాశాల కల్పనపై ప్రత్యేక దృష్టి
-త్వరలో విజయవాడలో అధికారిక ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థులు స్టార్టప్లు ప్రారంభించడంలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారంగా మయూఖా కనెక్ట్స్ అనే వినూత్న ఇనిషియేటివ్ను ప్రారంభిస్తున్నట్లు యువ ఫౌండర్ యాష్ తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశతో జరిగిన భేటీలో, విద్యార్థుల స్టార్టప్లకు సంబంధించిన ప్రధాన సమస్యలు—ప్రత్యేకంగా నెట్వర్కింగ్ లోపం, సరైన ఎకోసిస్టమ్ లేకపోవడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం స్టార్టప్లకు సంబంధించిన సంస్థలు ఉన్నప్పటికీ, అవి విద్యార్థులకు సమగ్రంగా సహాయం చేయడంలో లోపాలు ఉన్నాయని ఈ సమావేశంలో గుర్తించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో, విద్యార్థులు, ఫౌండర్స్, ఎంట్రప్రెన్యూర్స్ అందరూ ఒకే వేదికపై కలుసుకునేలా శక్తివంతమైన ఎకోసిస్టమ్ను నిర్మించడమే “Mayukha Connects” ప్రధాన లక్ష్యమని వివరించారు.
ఈ ఇనిషియేటివ్కు యాష్ ఫౌండర్గా, మహమ్మద్ ఖాన్ మరియు హేమంత్ కో-ఫౌండర్స్గా వ్యవహరిస్తున్నారు. ఈ వేదిక ద్వారా ప్రతి వారం ఉచిత నెట్వర్కింగ్ సెషన్స్ నిర్వహించడం, ప్రతి నెల కార్పొరేట్ స్థాయి ఈవెంట్స్ నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు సరైన అవకాశాలు లభించడంతో పాటు, ఫౌండర్స్కు సరైన ప్రతిభ దొరకడంతో ఒక బలోపేతమైన కనెక్షన్ ఎకోసిస్టమ్ ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఇనిషియేటివ్పై జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సానుకూల స్పందన తెలిపి, కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా “Mayukha Connects” కార్యక్రమానికి సంబంధించి అధికారిక అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకోవడం జరిగినట్లు వెల్లడించారు.
త్వరలో విజయవాడలో ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నట్లు, ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్లో స్టార్టప్ ఎకోసిస్టమ్కు గేమ్ చేంజర్గా మారుతుందని నిర్వాహకులు తెలిపారు.
సమావేశంలో జిల్లా యువజన సంక్షేమ అధికారి డాక్టర్ కొల్లేటి రమేష్ అన్నారు.
Prajavartha Online Telugu News