విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తో పశ్చిమ నియోజకవర్గంలో సంబరాలు నిర్వహించారు. పశ్చిమ బెంగాల్, అస్సోం, పుదుచ్చేరి లలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి విజయదుందుభి మోగించడం తో భవానీపురం లోని ఎమ్మెల్యే కార్యాలయంలో కూటమి శ్రేణులు హంగామా చేశారు.. బాణా సంచా కాల్చి విజయోత్సవాన్ని పంచుకున్నారు. అనంతరం కేక్ ను కట్ చేశారు. కార్యక్రమంలో ప్రత్తిపాటి శ్రీధర్, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, బిజెపి నాయకులు బుల్లా విజయ్ కుమార్, పైలా సురేష్, నరేంద్ర రాఘవ, బేసి కంటేశ్వరుడు, టీడీపీ నాయకుడు కొణిజేటి రమేష్, ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News