-పి.జి.ఆర్.ఎస్ కు టోల్ ఫ్రీ నంబర్ 1100
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్) ను ప్రాధాన్యతతో చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ తెలిపారు. ప్రభుత్వం టోల్ ఫ్రీ నంబర్ 1100 ఏర్పాటు చేసి ఆర్జీల పరిస్థితి తెలుసుకునే ఏర్పాటు చేసిందని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్)ను వినియోగించుకోవాలని కోరారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు తమ దరఖాస్తులను పి.జి.ఆర్.ఎస్ తో పాటు “మీకోసం” వెబ్ సైట్ లో ఆన్ లైన్ లోను సమర్పించవచ్చని తెలిపారు. అర్జీల వివరాలు
Meekosam.ap.gov.in
(మీకోసం డాట్ ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్) వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చని చెప్పారు. పి.జి.ఆర్.ఎస్ తో పాటు నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్ లను ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు.
Prajavartha Online Telugu News