నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఎన్నికల కోడ్ ఎత్తివేసిన కారణంగా ఈనెల 29వ తేదీ సోమవారం నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయము మరియు డివిజన్ పరిధిలోని రెవిన్యూ, ప్రభుత్వ కార్యాలయాల్లో స్పందన కార్యక్రమం యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని రెవిన్యూ డివిజనల్ అధికారి శ్రీమతి కె.రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలియజేశారు. గ్రామ/వార్డు సచివాలయాల్లో కూడా స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల నుండి ప్రజా సమస్యల దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని ఆర్డీఓ తెలిపారు.
Prajavartha Online Telugu News