అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానానికి సంబంధించిన మంగళగిరి బైపాస్ రోడ్ లోగల నాలుగుకాళ్ల మండపం ఆవరణ చుట్టూ దాదాపు 1.86 ఎకరాల స్థలాన్ని పరిరక్షించడానికి దాదాపు 40 లక్షల రూపాయలతో ప్రహరీ గోడ నిర్మించడానికి ఫిబ్రవరి 5వ తేదీన ముహూర్తం ఖరారు చేశారు. ఈరోజు 4 కాళ్ల మండపం ఆవరణలో జంగిల్ క్లియరెన్స్, పనులు దేవస్థాన అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే గారు నాలుగుకాళ్ల మండపాన్ని సందర్శించి జంగిల్ క్లియరెన్స్ పనులను పరిశీలించారు.
Prajavartha Online Telugu News