అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళవారం సచివాలయం రెండవ బ్లాకులో పిఆర్సి పై ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీతో పిఆర్సి స్ట్రగుల్ కమిటీ సభ్యులు సమావేశమై వారి విజ్ఞాపలను మంత్రులకు అందజేసి పిఆర్ సి సమస్యలపై చర్చించారు.ఈ కమిటీలో రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాధ్, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) పి.చంద్రశేఖర్ రెడ్డి తోపాటు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్ఆర్) శశిభూషణ్ కుమార్ పాల్గొన్నారు. అలాగే వివిధ ఉద్యోగ సంఘాల తరుపున స్ట్రగుల్ కమిటీ సభ్యులు బండి శ్రీనివాసరావు , కె ఆర్ సూర్యనారాయణ, కె వెంకటరామి రెడ్డి మరియు బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News