గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆగస్ట్ 1వ తేది సోమవారం ప్రజల నుండి స్థానిక సమస్యలపై అర్జీలు స్వీకరించే స్పందన కార్యక్రమం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో జరుగుతుందని నగర కమిషనర్ కీర్తి చేకూరి IAS ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు స్పందన కార్యక్రమం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ప్రజల నుండి కమిషనర్ నేరుగా ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. సచివాలయాల్లో మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు జరుగుతుందని, స్థానికంగా పరిష్కారం కాని సమస్యల పై కమిషనర్ కి అర్జీలు ఇవ్వవచ్చని తెలిపారు.
Prajavartha Online Telugu News