Breaking News

తిరుమల తిరుపతి దేవస్థానంకు లడ్డు ప్రసాదం లో వినియోగించేందుకు సేంద్రియ విధానం లో

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుమల తిరుపతి దేవస్థానంకు లడ్డు ప్రసాదం లో వినియోగించేందుకు సేంద్రియ విధానం లో పండించిన శెనగలను శెనగ పప్పు గా తయారుచేసి తిరుపతికి పంపించుట.వ్యవసాయ శాఖ ఆద్వర్యంలోని రైతు సాదరిక సంస్థ(RYSS) మరియు AP Markfed సంస్థల ఆధ్వర్యంలో రైతుల ద్వారా ప్రకృతి సాగు పద్దతిలో పండించిన శనగలను అదే విధానంలో శనగ పప్పుగా తయారు చేసి తిరుమల తిరుపతి దేవస్థానంకు లడ్డు ప్రసాదం లో వినియోగించేందుకు తిరుపతి కి పంపండం జరుగుతుంది.AP Markfed , NTR జిల్లా మేనేజర్ K .Nagamallika మాట్లాడుతూ RYSS ఆద్వర్యంలో సేంద్రియ విధానంలో పండించిన శెనగలను పరీక్షించి అందులో పురుగు మందుల అవశేషాలు లేవని ఫలితాలు వచ్చిన పంటను సేకరించి మిల్ కి చేర్చి అక్కడ తగు జాగ్రత్తలను తీసుకొని శనగ పప్పుగా తాయారు చేసి వాటిని మరల పరీక్షించి ఎటువంటి రసాయనిక అవశేషాలు లేవని ఫలితాలు వచ్చిన తరువాత వాటిని తగిన జాగ్రత్తలతో తిరుపతి కి చేర్చడం జరుగుతుంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *