విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వంగవీటి మోహన్ రంగా 35వ వర్ధంతి కార్యక్రమాన్ని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం విద్యాధరపురం చెరువు సెంటర్ వద్ద జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ పోతిన వెంకట మహేష్ నిర్వహించిన ఈ వర్ధంతి కార్యక్రమంలో పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని రంగ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు పండ్లు మరియు వస్త్రాలు పంపిణీ చేసినారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రజా నాయకుడు వంగవీటి మోహన రంగా అని, నిత్యం పేద సామాన్య ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేశారని, పదవులు కన్నా ప్రజా సమస్యల పరిష్కారం కోసమే అధిక ప్రాధాన్యత ఇచ్చారని, వారి స్ఫూర్తితో పేద సామాన్య వర్గాల అభివృద్ధి కోసం తప్పక కృషి చేస్తామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ బొలిశెట్టి వంశీకృష్ణ, డివిజన్ అధ్యక్షులు మల్లెపు విజయలక్ష్మి ,బొమ్మ రాంబాబు ,తిరుపతి అనూష ,తమ్మిన లీలా కరుణాకర్ ,ఏలూరు సాయి శరత్ ,కొరగంజి వెంకటరమణ, పొట్నూరి శ్రీనివాసరావు, సోమీ గోవింద్, నల్లబెల్లి కనకారావు ,రెడ్డిపల్లి గంగాధర్ ,సయ్యద్ ముబీనా, కూరాకుల సురేష్, వి హరిప్రసాద్ ,చందు శివరామకృష్ణ ,నాగరాజు, నగర ఉపాధ్యక్షులు కామల్ల సోమనాదం వెన్నా శివశంకర్, నగర కమిటీ శనివారపు శివ గన్ను శంకర్ బొట్టా సాయి చిరంజీవి యువత లక్నం శ్యాంప్రసాద్ సోడిశెట్టి కృష్ణ ప్రసాద్ పులిచేరి రమేష్, లీగల్ సెల్ గంజి పవన్ కుమార్, కేసన్ మూర్తి నాంచారయ్య బొప్పన శాంసంగ్ పైల పవన్ బొబ్బురి కొండ చిట్టి నగర్ శ్రీ నగరాల సీతారామస్వామి మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం కమిటీ సభ్యులు పోతిన సాంబశివరావు కోకా సాయి పిల్లా రవి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News