Breaking News

బీజేపీ అగ్రనేత ఎల్‌కే అడ్వాణీకి భారత రత్న అవార్డు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ అగ్రనేత ఎల్‌కే అడ్వాణీకి భారత రత్న అవార్డును ప్రదానం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము. అయితే అనారోగ్య కారణాల దృష్ట్యా ఈ అవార్డును ఆయన నివాసంలోనే ప్రదానం చేయాలని నిర్ణయించారు. ఆదివారం రాష్ట్రపతితో పాటు ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు అడ్వాణీ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రాజకీయాల్లో కీలక పాత్ర
ఎల్​కే అడ్వాణీ రాజకీయాల్లో ఏడు దశాబ్దలపైగా కీలకంగా పని చేసి దేశానికి సేవలందించారని రాష్ట్రపతి పేర్కొన్నారు. ‘1927లో కరాచీ (ప్రస్తుతం పాక్​లో ఉంది) జన్మించిన ఆయన 1947 దేశ విభజన సమయంలో భారత్​కు వలస వచ్చారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడవేసినప్పుడు దాని నుంచి రక్షించడంలో కీలకంగా వ్యవహిరించారు’ అని ఎక్స్ ​వేదికగా తెలిపారు. 1977-1979 వరకు అడ్వాణీ కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రిగా పనిచేశారు. 1999 నుంచి 2004 వరకు హోంమంత్రిగా, 2002 నుంచి 2004 వరకు దేశ ఉప ప్రధానిగా పని చేశారు. 1986 – 1990, 1993- 1998, 2004 నుంచి 2005 వరకు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *