-జగనన్న కోసం ఫ్యాన్ గుర్తుపై బటన్ నొక్కడానికి మేమంతా సిద్ధమంటున్న అక్క చెల్లెమ్మలు
ఉయ్యూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఉయ్యూరు మండలంలోని ఆకునూరు గ్రామంలో ఆదివారం ఇళ్లను సందర్శిస్తూ ప్రతిక్షణం ప్రజల కోసం అంటూ “గడపగడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ” కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు గురించి వివరిస్తూ, ఏమైనా సమస్యలు ఉంటే త్వరలో పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చి అనంతరం ఈనెల 24న నామినేషన్ సందర్భంగా స్వయంగా ఆహ్వాన పత్రికలు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామాత్యులు మరియు పెనమలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త జోగి రమేష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చలసాని స్మిత గౌతమ్ ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News