-బ్యాంక్ ఖాతాలు లేని వారికి వారి ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీ
-పింఛన్ల కోసం సచివాలయాల వద్దకు పింఛనుదారులు రానవసరం లేదు
విజయవాడ ఏప్రిల్ 28
ఏప్రిల్ నెల పింఛన్లు మే 1న వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయడం జరుగుతుందని, బ్యాంక్ ఖాతా లేని వారికి వారి ఇంటి వద్దనే పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందని, పింఛన్ల కోసం సచివాలయాల వద్దకు పింఛనుదారులు రానవసరం లేదని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ తెలిపారు. ఆదివారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వృద్ధాప్య, వితంతు, వికలాంగ తదితర 16 రకాల పింఛనుదారులలో 75 శాతం మందికి బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, వారికి పింఛన్లు మే ఒకటో తేదీనే వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయడం జరుగుతుందన్నారు. బ్యాంక్ ఖాతాలు లేని వారితోపాటు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, దివ్యాంగులు, బెడ్ రీడెన్ వారికి వారి ఇళ్ల వద్దనే మే 1 నుండి 5 తేదీ వరకు సచివాలయ ఉద్యోగుల ద్వారా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కావున పించన్దారులు ఎవ్వరూ పింఛన్ల కోసం సచివాలయాల వద్దకు రానవసరం లీడన్నారు. ఇదేవిధంగా మే నెల పింఛన్లు కూడా జూన్ 1 వ తేదీనే పింఛన్దారుల బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందని శశిభూషణ్ కుమార్ తెలిపారు.
Prajavartha Online Telugu News