Breaking News

జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు జీవన భృతికై మే 2వ తేదీ నుండి ఎన్యూమరేషన్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
చేపలవేట నిషేధ కాలంలో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు జీవన భృతి చెల్లించుటకు మే 2వ తేదీ నుండి ఎన్యూమరేషన్ ప్రారంభిస్తున్నామని ఎన్యూమరేషన్ ప్రారంభించి అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేయనున్నామని మత్స్యశాఖ కమిషనర్ ఏ. సూర్యకుమారి ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం సముద్రజలాల్లో 61 రోజులపాటు చేపలవేట నిషేదించినందున మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతున్న కారణంగా ప్రతీ సంవత్సరం చెల్లిస్తున్న విధంగానే ఈ సంవత్సరం కూడా జీవనభృతిని చెల్లించనున్నామని ఆమె తెలిపారు. జీవనభృతి చెల్లించుటకు ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా అనుమతిని కూడా తీసుకున్నామని ఆమె తెలిపారు. మే 2వ తేదీ నుండి ఎన్యూమరేషన్ ప్రారంభించి అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేస్తామని మత్స్యకారులందరూ సహకరించవలసినదిగా మత్స్యశాఖ కమిషనర్ ఏ. సూర్యకుమారి ఒక ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *