అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ పారిస్ ఒలింపిక్స్ లో కాంస్యపతకాన్ని సాధించడం ఆనందాన్ని కలిగించింది. అమన్ సెహ్రావత్ కు మనస్ఫూర్తిగాఅభినందనలు తెలియచేస్తున్నాను. రెజ్లింగ్ విభాగంలో మన క్రీడాకారుల ప్రతిభ ప్రశంసనీయమైనది. వినేశ్ ఫోగాట్ దురదృష్టవశాత్తూ ఫైనల్ పోటీకి దూరమైనా అమన్ పతకంసాధించడంతో క్రీడాభిమానులు సంతోషంగా ఉన్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటనలో తెలిపారు.
Prajavartha Online Telugu News