విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సుమారు 500 మంది వివిధ ప్రాంతాలలో అజిత్ సింగ్ నగర్, రాజరాజేశ్వరి కాలనీ, కృష్ణలంక ప్రాంతాలలో ఆహారం, నీరు, పాలు మొదలగు సేవలను గత రెండు రోజుల నుంచి అందిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ కొల్లేటి రమేష్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సిద్ధార్థ కళాశాల, నలంద కళాశాల, కేబీఎన్ కళాశాల, ఫార్మసీ కళాశాల మేరీ స్టెల్లా కళాశాల కు చెందిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేవలు అందిస్తున్నారని తెలిపారు.
Prajavartha Online Telugu News