విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారికి వైఎన్ఆర్ చారిటీస్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేశారు. మధురానగర్ లో నివాసముంటున్న చిన్నారి కీర్తన గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతూ హైదరాబాదులోని యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది. నిరుపేద కుటుంబం అయిన తమకి సాయం అందించాలని వై ఎన్ ఆర్ చారిటీస్ చైర్మన్ యలమంచిలి జయప్రకాష్ ను చిన్నారి కుటుంబ సభ్యులు సంప్రదించగా ఆయన సానుకూలంగా స్పందించారు. బుధవారం పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి ) చేతుల మీదగా తాడిగడపలోని తమ కార్యాలయంలో రూ 50 వేల నగదును అందజేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం సీనియర్ నాయకులు బొమ్మసాని సుబ్బారావు,యలమంచిలి జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News