ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పౌర సరఫరాల సంస్ధ జిల్లా మేనేజర్ గా నియమితులైన వి. శ్రీలక్ష్మి గురువారం రెవిన్యూ అతిధి గృహంలో గురువారం రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథిని పూలమొక్కను అందించి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ లో రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం సేకరించాలన్నారు. గోనెసంచులు , రవాణా వాహనాలు, తదితర సమస్యలు తలెత్తకుండా ధాన్యం సేకరించాలని, తేమ శాతం లెక్కింపు, ధాన్యం సేకరణ, తదితర అంశాలలో సిబ్బందికి శిక్షణ అందించి ధాన్యం సేకరణ ప్రక్రియను నిర్వహించాలని శ్రీలక్ష్మి ని మంత్రి పార్థసారథి ఆదేశించారు.
Prajavartha Online Telugu News