గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
స్వచ్చత హి సేవా ముగింపు కార్యక్రమాల్లో భాగంగా అక్టోబర్ 2న గుంటూరు నగరంలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో మెగా మాస్ క్లీనింగ్, అనంతరం శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ప్రజారోగ్య కార్మికులకు సన్మానం, పిపిఈ కిట్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు నగరపాలక సంస్థ విభాగాధిపతులు, అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 2 న స్వచ్చతా హి సేవా కార్యక్రమం ముగింపు కార్యక్రమాల నిర్వహణపై సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో అదనపు కమిషనర్, డిప్యూటీ కమిషనర్లు, విభాగాధిపతులు, ఇతర విభాగాల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
Prajavartha Online Telugu News