-డి ఎల్ ఎస్ ఎ సమావేశంలో దిశా నిర్దేశం
-కలెక్టరు పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పట్టాలాండ్స్ లేదా DKT భూముల ల్యాండ్ హోల్డర్ల నుండి ఇసుకను డి-కాస్టింగ్ చేయడానికి ప్రభుత్వం నిర్దేశించిన విధాన మార్గదర్శకాలు ఖచ్చితంగా అమలు చేయాలని, ఇసుక త్రవ్వకాల ధర నిర్ణయం తీసుకోవడం ఇతర జిల్లాలో ధరల వివరాలను విశ్లేషణ చేసి నివేదిక అందచేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. గురువారం ఉదయం జిల్లా స్థాయి ఇసుక కమిటీ (DLSC) సమావేశం, కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు తో కలిసి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశంలో కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, పట్టా భూముల నుంచి ఇసుకను తీయడం, వ్యవసాయం కోసం భూమి వినియోగాన్ని కొనసాగించడానికి “పట్టా భూముల లేదా డికెటి నుండి ఇసుకను తొలగించడానికి వివరణాత్మక మార్గదర్శకాలలో” ప్రభుత్వం G.O.Ms.No.59, పరిశ్రమలు & వాణిజ్య (గనులు-III) శాఖ, dt.01.10.2024 జారీ చేయబడిందన్నారు. అందుకు అనుగుణంగా అనుబంధ కార్యకలాపాలు చేపట్టాల్సి ఉంటుందనీ జిల్లా కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.
పట్టాదార్ పట్టాదార్ పాస్బుక్ మరియు టైటిల్ డీడ్ పుస్తకం మరియు గ్రామ మ్యాప్లో ఉన్న భూమి యొక్క నకలుతో పాటు జిల్లా కలెక్టర్కు దరఖాస్తు చేయాల్సి ఉంటుందన్నారు. క్షేత్ర స్థాయిలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ (DLSC) కింది వాటితో పట్టా భూమి యొక్క సంయుక్త తనిఖీని చేపట్టాలనీ, ఇందులో గ్రౌండ్ వాటర్, ఇరిగేషన్ , వ్యవసాయ, రెవెన్యూ , మైన్స్ అధికారులతో పాటు సంబంధిత డివిజన్ పరిధిలో ఆర్డిఓ , డిఎస్పి లు తనిఖి సమయంలో హాజరవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తహశీల్దార్ పట్టా భూమి, డికేటి యజమాని/ఆక్రమణదారుని గుర్తించాలి మరియు మైన్స్ కో-ఆర్డినేట్లతో సహా ధృవీకరించబడిన ప్లాన్ ను అందించాలన్నారు. , జిల్లా పంచాయతీ అధికారి NOCతో పాటు ప్రాంతాన్ని గుర్తించి, క్షేత్ర స్థాయిలో సరిహద్దులు నిర్ధారణ చేయాలన్నారు.
మండల వ్యవసాయ అధికారి అనుబంధ ప్రయోజనాల కోసం భూమిని వ్యవసాయానికి అనుకూలంగా మార్చడానికి తొలగించాల్సిన ఇసుక పరిణామాన్ని అంచనా వేయాల్సిన బాధ్యత వహించాల్సి ఉంటుందని కలెక్టరు పేర్కొన్నారు.
భూగర్భ జల శాఖ, తహశీల్దార్ నిర్ణయించిన సరిహద్దుల ప్రకారం పట్టాల్యాండ్లోని జియో కోఆర్డినేట్లను నమోదు చేసి , సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇవ్వాలన్నారు.
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్., పట్టా భూములను డి-కాస్టింగ్ చేయడానికి క్లియరెన్స్ జారీ చేయాలి మరియు పట్టా భూమిని రివర్ కోర్సు/బెడ్తో పాటుగా సూచించాల్సి ఉంటుందన్నారు. 5 కీ మీ పరిధి లోపల, బయట అన్న అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి ఆమేరకు నివేదిక అందచేయాలన్నారు. రాంప్ పాయింట్లను గుర్తించడం లో జిల్లా గనులు మరియు భూగర్భ అధికారి నిర్దేశిస్తారనీ, డి-కాస్టింగ్ కాలం మరియు సాండ్ యొక్క సాధ్యమయ్యే పరిమాణాన్ని అంచనా వేయండం, ప్రభుత్వం నిర్దేశించిన నమూనా లో జాయింట్ తనిఖీ నివేదిక పొందుపరచడం తో సంభందిత అధికారులు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని కలెక్టరు ప్రశాంతి పేర్కొన్నారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, ఆర్డీఓ లు ఆర్ కృష్ణ నాయక్, రాణి సుస్మిత, జిల్లా మైన్స్ &జూవాలజి అధికారి డి. ఫణి భూషణ్ రెడ్డి, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి బి శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, ఈ ఈ (ఇరిగేషన్ రివర్ కన్సర్వేటరీ) ఆర్ కాశీ విశ్వేశ్వరరావు, జిల్లా ఆర్ డబ్ల్యు ఎస్ అధికారి బీవి గిరి, జిల్లా రవాణా అధికారి ఆర్. సురేష్ , కొవ్వూరు డిఎస్పీ దేవ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News