ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రముఖ బిజెపి నాయకులు మరియు అమరావతి బోటింగ్ క్లబ్ CEO డాక్టర్ తరుణ్ కాకాని సోమవారం కుటుంబ సమేతంగా శ్రీ కనక దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానాన్ని సందర్శించి మహాచండీ దేవి అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. విజయవాడ పీఠాధిపతి మండప ఆశీర్వచనం ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ దసరా ఉత్సవాల ఏర్పాట్లపై, మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆలయ ఉత్సవ కమిటీ సభ్యుల సేవలను కొనియాడారు. వృద్ధలకు వీల్ చైర్ ఏర్పాటు, భక్తులకు త్రాగు నీరు ఏర్పాటు చేశారన్నారు. వరదల నుండి ఇతర ప్రకృతి విపత్తుల నుండి బెజవాడవాసులకి విముక్తి కలాగాలని సర్వేజనా సుఖినోభవంతు అని అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు.
Prajavartha Online Telugu News