విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పార్టీ నగర కార్యాలయంలో శనివారం రాత్రి సంబరాలు నిర్వహించారు. నగర అధ్య క్షుడు నరహరిశెట్టి నరసింహారావు, ఏఐసీసీ ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ, వి. గురునాథంల ఆధ్వ ర్యంలో కేకు కోశారు. ఖర్గే బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింద న్నారు. 60 సంవత్సరాలుగా చట్ట సభలకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లా కాపు సెల్ నాయకుడు అల్లం రాజేష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News