విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సీనియర్ సిటిజన్ లకు చేతి కర్రలను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.గురునాధం, సీనియర్ న్యాయవాది పడవల ఏడుకొండలు బహుకరణ చేశారు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని దుర్గాపురం వాకర్స్ క్లబ్ నందు సీనియర్ సిటిజెన్ల భద్రతమైన నడక సౌకర్యార్థం చేతి కర్రలను క్లబ్ అధ్యక్షులు ఎస్.కె. బాబు, సెక్రటరీ సత్యనారాయణ, ఉపాధ్యక్షులు రూప్ కుమార్ కమిటీ సభ్యులకు బహుకరణ చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.గురునాధం అందచేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది పడవల ఏడుకొండలు, పద్మనాభ రావు, రాధాకృష్ణ, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News