విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు సర్కిల్ వన్ లోని సి డి ఒ లు, సోషల్ వర్కర్లు, సి ఒ లు , ఆర్ పి లు, డ్వాక్రా సంఘాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ శనివారం భవానిపురం లోని ఎన్డీఏ కార్యాలయంలో సమావేశమయ్యారు. సంక్షేమ పథకాల అమలుపై చర్చించి నిజమైన లబ్ధిదారులకు పథకాలు అందే విధంగా ప్రతి విభాగం నిస్వార్ధంగా పనిచేయాలన్నారు. కూటమి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతం చేయడానికి డ్వాక్రా సంఘాలకు, కమ్యూనిటీ సంస్థలు వారి సమాఖ్యలకు శిక్షణను ఇస్తామన్నారు. పేదరిక నిర్మూలనలో భాగంగా నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు శిక్షణ తోడ్పాటు నిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News