Breaking News

నారా రామ్మూర్తి నాయుడు సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం

-రామ్మూర్తి మృతికి ఎంపి కేశినేని శివనాథ్ సంతాపం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోదరుడు, చంద్ర‌గిరి మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు మృతి ప‌ట్ల ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) తీవ్ర దిగ్భాంత్రి వ్య‌క్తం చేశారు. 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి ఎమ్మెల్యే గా రామ్మూర్తి నాయుడు ప్ర‌జ‌ల‌కు చేసిన సేవ‌లు ఎన‌లేనివి. పార్టీకి అందించిన సేవ‌లు వెల‌క‌ట్ట‌లేనివి, చిరస్మరణీయం. ఆయ‌న మ‌ర‌ణం నారా కుటుంబానికి తీర‌ని లోటు అని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ శ‌నివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. నారా రామ్మూర్తి నాయుడు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భ‌గ‌వంతుడ్ని కోరుకుంటూ శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు ఎంపి కేశినేని శివనాథ్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేయటంతోపాటు ఆయ‌న‌ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. అలాగే సోద‌ర వియోగంతో చింతిస్తున్న సీఎం చంద్ర‌బాబు నాయుడుకి త‌న ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *