-త్వరతగతిన దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి
-పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకాల కోసం మెగా డీఎస్సీ -2025 దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 15తో ముగియనుందని, చివరి రోజు వరకూ ఆగకుండా, అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు త్వరితగతిన దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపింది. గత నెల 20న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 3,03,527 మంది అభ్యర్థులు 4,77,879 (వివిధ పోస్టులకు) దరఖాస్తు చేసుకున్నారని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తెలిపారు.
Prajavartha Online Telugu News