విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గంలోని 55 వ డివిజన్ కు చెందిన ఆశ్రాపున్నీస గర్భ సంచి సమస్యతో బాధ పడుతుండడంతో వైద్యులు ఆమెకు సర్జరీ చేయాలని, 1,80,000/- ఖర్చు అవుతుందని తెలిపారు. అదే విధంగా భవానీపురం కి చెందిన బచ్చు శివకుమారి గుండె సంబంధిత వ్యాధితో బాధ పడుతుండటం తో బై పాస్ సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు.. వీరీరువురూ సమస్య ను ఎమ్మెల్యే సుజనా చౌదరి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన సీఎం సహాయ నిధికి లేఖలు రాసారు.. వాటికి సంబంధించిన ఎల్వోసీ లను సోమవారం బాధితుల కుటుంబ సభ్యులకు అంద చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి పత్తిపాటి శ్రీధర్ , 42వ డివిజన్ టిడిపి అధ్యక్షుడు పత్తి నాగేశ్వరరావు, 39 వ డివిజన్ బిజెపి మాజీ కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర, బిజెపి నాయకులు బుల్లా విజయ్ , 52వ డివిజన్ టిడిపి అధ్యక్షులు ఈగల సాంబ శివరావు, సుజనా మిత్ర లు పాల్గొన్నారు..
Prajavartha Online Telugu News