Breaking News

Daily Archives: September 15, 2024

కులగణన డిమాండ్‌తో విజయవాడలో అక్టోబర్‌ 9న బీఎస్పీ మహాధర్నా

-పల్నాడులో 77 ఏళ్ళ ఎన్నికల్లో కేవలం ఐదుగురు బీసీ ఎమ్మెల్యేలు ఇది దారుణం -చట్టసభల్లో, నామినేటెడ్‌ పదవుల్లో బీసీ కోటా తేలాలంటే ముందుగా కులగణన జరపాలని డిమాండ్‌ -రిటైర్డ్‌ డీజీపీ & బీఎస్పీ ఏపీ కోఆర్డినేటర్‌ డా. పూర్ణచంద్రరావు నరసరావుపేట, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్య్రం వచ్చిననాటి నుండి ఇప్పటికి ఏపీలో 16 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 2,902 మంది ఎమ్మెల్యేలు అయితే, జనాభా దామాషా ప్రకారం బీసీలు దాదాపు 1,450 మంది అవ్వాలి. కానీ కేవలం 550 మంది మాత్రమే బీసీలు …

Read More »

అక్కినేని వెంకటేశ్వరరావు సేవలు మరువలేం… : ఎమ్మెల్యే  గద్దె రామ్మోహన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా మరియు జిల్లా పంచాయతీ ఇంజనీరింగ్ అధికారిగా పనిచేసిన అక్కినేని వెంకటేశ్వర రావు సేవలు మరువలేనివని, ఆయన జిల్లాలో ఏ నియోజకవర్గంలో పనిచేసిన ప్రజలకు అనుగుణంగా ప్రజాప్రతినిధులకు గౌరవాన్నిస్తూ పనులన్నిటిని చక్కబట్టారని, ఎక్కడ ఎటువంటి మచ్చ లేని మనిషి  అక్కినేని వెంకటేశ్వరరావు అని, ఆయన పదవీ విరమణ డిపార్ట్మెంటుకు లోటు అని స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ తెలిపారు. విజయవాడ జ్యోతి కన్వెన్షన్ సెంటర్లో ఇంజనీరింగ్ సంఘం మరియు కాంట్రాక్టర్స్ సంయుక్తంగా …

Read More »

చివ‌రి మైలు వ‌ర‌కు న్యాయం చేయాల‌నేదే ప్ర‌భుత్వ ల‌క్ష్యం

-వ‌ర‌ద ప్ర‌భావం ప‌డిన ప్ర‌తి బాధితున్నీ ఆదుకుంటాం -అత్యంత పార‌ద‌ర్శ‌కంగా న‌ష్ట వివ‌రాల న‌మోదు -డేటా రీవెరిఫికేష‌న్‌తో పాటు సూప‌ర్వైజ‌రీ చెక్ ప్ర‌క్రియ‌నూ చేప‌డుతున్నాం -రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రివ‌ర్యులు పొంగూరు నారాయ‌ణ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ‌ర‌ద ముంపు ప్ర‌భావంప‌డిన ప్రాంతాల్లో చివ‌రి మైలు వ‌ర‌కు న్యాయం చేయాల‌నేదే రాష్ట్ర ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని.. ప్ర‌తి బాధితునికీ అండ‌గా నిలిచేందుకు చేస్తున్న కృషిలో భాగంగా అత్యంత పార‌ద‌ర్శ‌కంగా న‌ష్ట వివ‌రాల న‌మోదుతో నివేదిక‌లను రూపొందిస్తున్న‌ట్లు రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ …

Read More »

పరిశ్రమల అభివృద్ధికి సంపూర్ణ సహకారం… : తిరుపతి ఎంపీ గురుమూర్తి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 84 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయని, స్కిల్ల్డ్ మ్యాన్ పవర్ కు ఎలాంటి ఇబ్బంది లేదని ఎంపీ డాక్టర్ గురుమూర్తి అన్నారు. ఆదివారం రామతులసి కల్యాణమండపంలో ఛాంబర్ అఫ్ కామర్స్ ఆధ్వర్యంలో పరిశ్రమల అభివృద్ధి కోసం నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పలు రకాల ఎంఎస్ఎంఇ గ్రాంట్స్ ఉన్నాయని కానీ ఆ నిధులను ఒక ఆర్గనైజేషన్ మినహా మిగిలిన 29 ఆర్గనైజేషన్లు ఉపయోగించుకొన్నట్లు లేదని అన్నారు. …

Read More »

రేణిగుంట గురుకుల పాఠశాలను సందర్శించిన… ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్

రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త : రేణిగుంటలోని విమానాశ్రయం సమీపంలో గల గురుకుల పాఠశాలను ఆదివారం సాయంత్రం ఏపీ స్టేట్ ఎస్టి కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలోని తరగతుల గదులను విద్యార్థుల నైపుణ్యాన్ని అడిగి తెలుసుకుంటూ మమేకమయ్యారు. భోజనశాల, పడకగదులను, త్రాగునీరు, మరుగుదొడ్లను పరిశీలించి లోటుబాటుల గురించి ఆరా తీశారు. అనంతరం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతో మాట్లాడుతూ పిల్లలకు మెరుగైన విద్యను అందించాలని సూచించారు. పేదరికంతో నివాసాలను వదిలి హాస్టల్లో చదువుకునే విద్యార్థులు విద్యను గొప్పగా అభ్యసించాలని విద్యార్థులకు …

Read More »

జి. యర్రంపాలెం బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచి లో దుర్వినియోగం అయినా రూ.67.52 లక్షలు వసూలు

-అధికారుల సమక్షంలో సెప్టెంబర్ 17 నుంచి చెల్లింపులు -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జి . యర్రంపాలెం బ్యాంకు ఆఫ్ బరోడా బ్రాంచి లో దుర్వినియోగం అయిన సొమ్ము రూ.67.52 లక్షలను సెప్టెంబరు 17 నుంచి బ్రాంచి నందు చెల్లింపులు జరుపుతున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొనడం జరిగింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, జి. యర్రంపాలెం బ్రాంచ్ కు చెందిన వ్యాపార కరస్పాండెంట్ ముతాబత్తుల నానిబాబు ద్వారా కస్టమర్ లకు చెందిన డిపాజిట్‌లను …

Read More »

ఫ్రీ హోల్డ్ భూముల రికార్డుల పరిశీలన కార్యక్రమం పూర్తి చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెలాఖరిలోగా ఫ్రీ హోల్డ్ భూముల రికార్డుల పరిశీలన కార్యక్రమం పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్ పి సిసోడియా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఆదివారం ఉదయం ముఖ్య కార్యదర్శి సీసీఎల్ఏ జి జయలక్ష్మి తో కలసి రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లతో ఫ్రీ హోల్డ్ భూములపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాల వారిగా సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి మాట్లాడుతూ ఫ్రీ హోల్డ్ భూముల పరిశీలన కార్యక్రమాన్ని వేగవంతం చేసి ఈనెలాఖరులోగా పూర్తి …

Read More »

నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా అధికారులు, క్షేత్రాధికారులు, పోలీసు అధికారులతో గణేష్ విగ్రహాల నిమజ్జనం ఏర్పాట్లపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పలుచోట్ల గణేష్ విగ్రహాల నిమజ్జనం జరగబోతున్నదని అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు …

Read More »

శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న హిమాన్షు శుక్ల

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : రెండు రోజుల తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం విచ్చేసిన రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్ల మరియు కమిషనర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కృతిక శుక్ల వారు కుటుంబ సమేతంగా నేటి ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వీఐపీ విరామ సమయంలో దర్శించుకున్నారు. ముందుగా వరాహస్వామి వారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శించుకున్నారు. నిన్నటి రోజున శ్రీకాళహస్తీశ్వరస్వామి వారిని వారు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి …

Read More »

గిరిజన సంక్షేమం కొరకు కృషి: ఆం.ప్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్య శంకర్ నాయక్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ మెంబర్ వడిత్యా శంకర్ నాయక్ తిరుపతి శ్రీ పద్మావతి అతిథి గృహం నందు నేటి ఆదివారం గిరిజన సోదర సోదరీమణులు నుండి ఫిర్యాదులను తీసుకున్నారు. అలాగే కీర్తిశేషులు గుండాల నాయక్ సంతాప సూచకంగా బైరాగి పట్టెడ, గిరిజన భవన్ నందు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల రేణిగుంట పరిశీలించి విద్యార్థుల తెలుగు ఇంగ్లీష్ సామర్ధ్యాన్ని పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా …

Read More »