Breaking News

Monthly Archives: September 2024

దాతృత్వం చాటుకుంటున్న దాతలు…వెల్లువలా విరాళాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. వరద బాధితులకు సహాయం అందించేందుకు ముందుకు రావాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుతో దాతల నుండి స్పందన పెద్ద ఎత్తున లభిస్తోంది. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో సీఎం చంద్రబాబును రాజకీయ పార్టీల నేతలు, పలు వ్యాపార సంస్థల అధినేతలు, ఉద్యోగులు, ప్రముఖులు, కార్మిక సంఘాల నాయకులు కలిసి విరాళాలను చెక్కు, నగదు రూపంలో అందించారు. విరాళాలు అందించిన వారిలో…. 1. కాటూరి సుబ్బారావు రూ.10 …

Read More »

ప్రతి గడపకూ ప్రభుత్వ సాయం అందిస్తా

– వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి తోడుగా ఉంటాం – ఒక్కొక్కరికి రూ.5 లక్షల సాయం అందించిన మంత్రి – వరద నీటిలో ట్రాక్టర్‌పై వెళ్లి సహాయక చర్యల్ని పర్యవేక్షించారు – ఐఏఎస్‌లు, సీనియర్ నాయకులు, సచివాలయ సిబ్బందితో సహాయం – ఈ రోజు నుండే ఆరు రకాల రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్నాం – బుడమేరుకు పడిన గండ్లు పూడ్చివేత పనులు త్వరితగతిన జరుగుతున్నాయి – నష్టపోయిన రైతులకు పరిహారం అందించేలా చర్యలు ప్రారంభించాం – కేంద్ర మంత్రి కూడా రైతుల విషయంలో …

Read More »

వరద ప్రభావిత ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి

-నిరంతర పారిశుద్ధ్య చర్యలు చేపట్టి కాలనీలు -పరిశుభ్రంగా ఉంచాలి -అధికారులను ఆదేశించిన రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసుపార్ధ సారధి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని 32,52 డివిజన్లలో శుక్రవారం ఆయన పర్యటించి బాధితులకు ఆహారం పాలు పంపిణీ చేశారు.అలాగే ఫైర్ ఇంజిన్ నీటితో పరిసరాలను శుభ్రం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో శానిటేషన్ నిరంతరం జరగాలని,కాలనీలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. వరద దెబ్బతిన్న ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా చూడాలని,మందులు,ఇతర మెడికల్ కిట్లతో …

Read More »

ప్రజలందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు : మోటూరి శంకరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వినాయక చవితి సందర్భంగా ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో పర్యావరణ హితంగా ఉత్సవాలు జరుపుకోవాలని ఏపీ స్టేట్ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ వెల్ఫేర్‌ ఆసోసియేషన్‌ అధ్యక్షులు మోటూరి శంకరరావు నేడు ఒక ప్రకటనలో వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితి ఎంతో పవిత్రమైన పండుగ అని, అన్ని విఘ్నాలను, సంకటాలను హరించి విజయాన్ని అందించే వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రజలందరి ఇంటా విఘ్నాలు తొలగి వారు ఆయు ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో, సౌభాగ్యాలతో సిరి సంపదలతో …

Read More »

పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతి పూజను ప్రోత్సహించిన రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలుగు రాష్ట్ర ప్రజలకు పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతి పూజను ప్రోత్సహిస్తూ, ఎక్స్‌లో పోస్ట్ చేశారు. “మట్టిలో పరమాత్మను దర్శించే అద్భుతమైన తత్వదర్శనం, యోగదర్శనం పార్థివ గణపతి పూజలో ఉన్నది గనుక . వినాయక చవితికి గణపతిని మట్టితో తయారు చేయాలని పురాణాది శాస్త్రాలు సూచిస్తున్నాయి. అలాగే, ప్రజలకు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. “కావున, …

Read More »

ప్ర‌తి ఇంటి తో పాటు చిరు వ్యాపార‌స్తుల‌కి ఆర్థిక సాయం : ఎంపి కేశినేని శివ‌నాథ్

-నిత్యావసర వస్తువుల వాహనాలను ప్రారంభించిన ప్ర‌జా ప్ర‌తినిధులు -వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ -వారం రోజుల్లో బుర‌ద ర‌హిత విజ‌య‌వాడ -ఇళ్లు, రోడ్లు క్లీనింగ్ కాగానే మ‌రమ్మ‌త్తుల కార్య‌క్ర‌మం -వ‌ర‌ద తాకిడికి పాడైపోయిన టివి, ప్రిడ్జ్, గ్యాస్ పోయ్యిలు -వరద బాధితులను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు -బ‌ట్ట‌లు, దుస్తుల పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ‌ర‌ద బాధితుల‌కి అన్నిర‌కాలుగా ఆదుకునేందుకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చ‌ర్య‌లు తీసుకుంటున్నాడు. వర‌ద ముంపులో మునిగిపోయిన ప్రతి ఇంటికి ఆర్థిక …

Read More »

విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన రాష్ట్ర న్యాయ,మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్

-వరద బాధితులు అందరినీ ప్రభుత్వం ఆదుకుంటుంది -చంద్రబాబు నేతృత్వంలో ప్రజలకు అండగా నిలిచేందుకు ముమ్మర చర్యలు -అవివేకంతోనే జగన్ అర్థంపర్థం లేని ఆరోపణలు -వరద బీభత్సాన్ని కేంద్ర బృందం స్వయంగా పరిశీలించింది అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలో బుడమేరు ఉగ్రరూపంతో ముంపుకు గురై తీవ్ర నష్టాన్ని చవిచూసిన బాధితులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర న్యాయ,మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ భరోసా ఇచ్చారు. శుక్రవారం అజిత్ సింగ్ నగర్ లో వరద బీభత్సంతో ఐదవ రోజు కూడా …

Read More »

వరద బాధితులకు దుప్పట్లు, చీరలు, మందులు నిత్యావసర వస్తువులు పంపిణీ

-అపన్న హస్తం అందించిన జమ్మలమడుగు ఎమ్మెల్యే చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి, కడప పార్లమెంట్ ఎన్డీఏ కూటమి ఇన్చార్జ్ చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : *బుడమేరు వరద ముంపుతో సర్వం కోల్పోయిన నగరంలోని కబేలా, వించిపేట ,నైజాం గేట్, జ్యోతి నగర్, వన్ టౌన్ ప్రాంతాల్లో బాధితులకు శనివారం జమ్మలమడుగు ఎమ్మెల్యే చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి, కడప పార్లమెంట్ ఎన్డీఏ కూటమి ఇన్చార్జ్ చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి ఆపన్నహస్తం అందించారు. గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు సర్వం …

Read More »

అడవుల విధ్వంసానికి పాల్పడితే కఠిన చర్యలు..

-దేవరపల్లి, మారేడుమిల్లి ఘటనల్లో ఇప్పటికే అధికారుల సస్పెండ్.. -నిష్పక్షపాతంగా విచారణ.. తుది నివేదిక రాగానే చర్యలు.. -చిరంజీవ్ చౌదరి, ప్రిన్సిపల్ ఛీప్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అటవీశాఖపై మీడియాలో వస్తున్న వార్తలకు ప్రిన్సిపల్ ఛీప్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చిరంజీవ్ చౌదరి స్పందించారు. 22.02.2024న PCCF & HOFF జారీ చేసిన సూచనల ప్రకారం, DFO, ఫ్లయింగ్ స్క్వాడ్, రాజమండ్రి వారు తన బృందంతో కలిసి 28.02.2024 నుండి 07.03.2024 వరకు రంపచోడవరం డివిజన్ లో నిర్దిష్ట …

Read More »

ఈ నెల సెప్టెంబర్ 10 నుండి “పొలం పిలుస్తోంది” కార్యక్రమాన్ని జిల్లాలోని రైతు సోదరులు సద్వినియోగం చేసుకోవాలి

-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 10వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ” పొలం పిలుస్తోంది” అనే కార్యక్రమం నిర్వహించబడుతుందని, జిల్లాలోని రైతు సోదరులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ నందు జిల్లా కలెక్టర్ గారు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ప్రసాదరావు తదితర సంబంధిత అధికారులతో కలిసి “పొలం పిలుస్తోంది” కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా …

Read More »