Breaking News

Monthly Archives: September 2024

ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వ‌హ‌ణ‌లో మార్పు మొదలయ్యింది-పూర్తి ఫ‌లితాలు సాధించాల‌న్న ఆరోగ్య శాఖ మంత్రి

-త్వరలో ప్రజలకు ఆశించిన మార్పు కనపడాలి-అలసత్వాన్ని సహించమన్న మంత్రి సత్యకుమార్ యాదవ్ -మెరుగైన పనితీరు కోసం రూపొందించిన 30 అంశాల ప్రణాళిక అమలుపై సచివాలయంలో సుదీర్ఘంగా సమీక్షించిన మంత్రి -రోగులకు సంతృప్తికరమైన సేవల్ని అందించడమే లక్ష్యంగా పనిచేయాలన్న ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణ బాబు -మెరుగైన నిర్వ‌హ‌ణ కోసం గత నెల రోజులుగా చేపట్టిన చర్యల్ని వివరించిన 17 ప్రభుత్వాసుపత్రుల సూపరింటెండెంట్లు అద‌న‌పు ఓపీ కౌంట‌ర్లు, సాయంకాలం ఓపీ, ఫిర్యాదుల సేక‌ర‌ణ‌, ప‌రిక‌రాల ఆడిట్, సైనేజీ బోర్డులు మొద‌ల‌గు చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు వివ‌రించిన సూప‌రింటెండెంట్లు …

Read More »

రైతుల‌ను సీఎం చంద్ర‌బాబు ఆదుకుంటారు : ఎంపి కేశినేని శివ‌నాథ్

-వ‌ర‌ద ముంపుకి గురైన పంట పొలాలు ప‌రిశీల‌న‌ -ఎమ్మెల్యే సౌమ్య‌తో క‌లిసి చెవిటిక‌ల్లు లో ప‌ర్య‌ట‌న‌ -బుర‌ద రాజ‌కీయం చేసే జ‌గ‌న్ జీవితం అబ‌ద్ధం కంచిక‌చ‌ర్ల, నేటి పత్రిక ప్రజావార్త : వ‌ర‌ద ముంపు వ‌ల్ల పంట పొలాలు నీటి మునిగి న‌ష్ట‌పోయిన రైతులంద‌ర్నీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆదుకుంటార‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ తెలిపారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య‌తో క‌లిసి కంచిక‌చ‌ర్ల మండ‌లం చెవిటిక‌ల్లు గ్రామంలో నీట మునిగిన పంట పొలాల‌ను గురువారం ప‌రిశీలించారు. రైతుల‌తో మాట్లాడారు. న‌ష్ట‌పోయిన రైతుల‌ను రాష్ట్ర …

Read More »

మంగళగిరి లో త్వరలో క్రికెట్ హబ్ ఏర్పాటు చేస్తాం : ఎం.పి.కేశినేని శివ నాథ్

-ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ సమావేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని ప్రాంతమైన మంగళగిరిలో ఆంధ్ర క్రికెట్ అకాడమీ కార్యాలయం లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ సమావేశం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యం లో గురువారం జరిగింది. ఈ సమావేశం అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ అతి త్వరలో క్రికెట్ స్టేడియం పూర్తి చేసి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడేందుకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తావని అదే విధంగా స్థానిక ఎమ్మెల్యే ఐటి శాఖ మంత్రి …

Read More »

ఆదుకుంటాం అండగా ఉంటాం… : ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) గత రెండు రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాలలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. గురువారం లేబర్ కాలనీ, చెరువు సెంటర్, రాజరాజేశ్వరి పేట, తదితర ప్రాంతాలలో పర్యటించి బాధిత కుటుంబాలతో మాట్లాడారు. వరద బాధితులను అన్ని విధాల ఆదుకుంటామని అధైర్య పడోద్దని ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. విపత్తు సమయంలో బాధితులకు శరవేగంగా సాయం అందించడానికి కూటమి నాయకులు ప్రభుత్వ అధికారులు, సుజనా ఫౌండేషన్ సిబ్బంది …

Read More »

రోడ్ల ప్యాచ్ వర్క్స్ పై ఆదేశాలు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వర్షాల వలన దెబ్బతిన్న రోడ్లకు యుద్దప్రాతిపదికన ప్యాచ్ వర్క్ లు, 2 రోజుల్లో పూర్తి చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం నగర కమిషనర్ ఇంజినీరింగ్ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా రోడ్ల ప్యాచ్ వర్క్స్ పై వివరాలు అడిగి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో వర్షాల వలన దెబ్బతిన్న రోడ్ల వలన ప్రజల రాకపోకలకు అసౌకర్యం …

Read More »

డ్రైన్ల పై ఆక్రమణలు ఏర్పాటు చేయవద్దు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : డ్రైన్ల ఆక్రమణలు, రోడ్ల మీదకు ర్యాంప్ లు నిర్మాణం చేస్తే వర్షాలు వచ్చినప్పుడు నీరు వెళ్లడానికి మార్గం లేక ఇళ్లల్లోకి వస్తుందని, కనుక ప్రజలు తమ ఇళ్లు, షాప్ ల ముందు డ్రైన్ల పై ఆక్రమణలు ఏర్పాటు చేయవద్దని విజయవాడ 62వ డివిజన్ పర్యవేక్షణ అధికారి, గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ కోరారు. గురువారం విజయవాడ 62వ డివిజన్ లోని ప్రధాన రహదారుల వెంబడి డ్రైన్ల ఆక్రమణలను 2వ రోజు జెసిబిలతో తొలగించారు. ఈ …

Read More »

పోషన్ ప్లస్ కార్యక్రమాన్ని అక్టోబర్ 1 నుంచి అమలు

-బాలికలకు అదనపు పోషక ఆహారం గా మునగాకు పొడి అందజేయాలి -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కౌమార దశ లోని ఆడపిల్లల్లో రక్తహీనత తలెత్తకుండా నివారించే క్రమంలో కార్యకలాపాల్లో భాగస్వామ్యం  పోషన్ ప్లస్ 2.2 వెర్షన్ ను అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి మునగాకు పొడి పంపిణీ చేయడాన్ని కొనసాగించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పోషన్ ప్లస్ కార్యక్రమం పై సమన్వయ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష …

Read More »

సాధారణ తనిఖీల్లో భాగంగా తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ పి ప్రశాంతి

-ప్రజా సమస్యల, అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు -గురువారం సాయంత్రం తాళ్లపూడి మండలం తహసిల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు తాళ్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి కార్యాలయ రికార్డులను పరిశీలించారు. కార్యాలయ పరిథిలో మ్యూటేషన్ కు చెందిన రెండు దరఖాస్తులు పెండింగుకు సంబంధించిన వివరాలు పరిశీలించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకా లను అనుసరించి సకాలంలో పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ప్రతి సోమవారం …

Read More »

సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హి సేవా – 2024

-వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కలెక్టర్ల కు దిశా నిర్దేశనం -క్షేత్ర స్థాయిలో అవగాహాన, అమలు కార్యక్రమాలు -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : స్వభావ స్వచ్ఛత – సంస్కార స్వచ్ఛత సాధన కొరకు స్వచ్ఛతా హి సేవా – 2024 కార్యక్రమం లో భాగంగా సెప్టెంబరు 17 నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు వరకూ  మూడు కీలక అంశాలతో ప్రజల్లోకి తీసుకుని వెళ్లడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం …

Read More »

కొవ్వూరు ఐసిడిఎస్ పరిధిలో 12 ఆయా పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

-సిడిపివో ఎమ్. మమ్మీ కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకము కొవ్వూరు నందు 12 అంగన్వాడి కేంద్రములలో ఖాళీగా ఉన్న 12 అంగన్వాడీ సహాయకురాలు పోస్టులకు దరఖాస్తులు కోరబడుచున్నవని కొవ్వూరు శిశు అభివృద్ధి పధక అధికారిణి డి . మమ్మీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొనడం జరిగింది. ఏ అంగన్వాడీ కేంద్రమునకు, సహయకురాలు పోస్టు నకు ధరఖాస్తు చేయుచున్నది దరఖాస్తులో స్పష్టముగా ఉండవలెను. ఉద్యోగ వివరము : అంగన్వాడి హెల్పరు (ఆయా), ఖాళీగా ఉన్న అంగన్వాడి కేంద్రము, …

Read More »